న్యూఢిల్లీ : మధుమేహులు కొవ్వు పదార్ధాలు, రిఫైన్డ్ చక్కెరకు దూరంగా ఉండటంతో పాటు తక్కువ కార్బోహైడ్రేట్లతో కూడిన ఆహారం తీసుకోవడం ద్వారా రక్తంలో గ్లూకోజ్ను మెరుగ్గా నియంత్రించవచ్చని డయాబెటలాజియాలో ప్రచురితమైన తాజా అధ్యయనం వెల్లడించింది. మధుమేహంతో బాధపడే రోగులు సరైన ఆహారం తీసుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చని అలాగే అధిక క్యాలరీలు తీసుకోకుండా జాగ్రత్తలు పాటిస్తే రక్తంలో చక్కెర నిల్వలు అమాంతం పెరగకుండా నిరోధించవచ్చని పేర్కొంది.
ఇక మధుమేహులు బీన్స్, ఆకుకూరలు, చికెన్, చేపలు, గుడ్లు, ఫైబర్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు, ఆరోగ్యకరమైన కొవ్వుల కోసం దేశీ నెయ్యి, సన్ఫ్లవర్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, తృణధాన్యాలు, ఓట్స్ వంటి ఆహారాన్ని ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.