Apps:
Follow us on:

Health Tips | పండ్లపై ఉప్పు, కారం చల్లుకొని తినడం ఆరోగ్యానికి మంచిదేనా?

1/7చాలా పండ్లలో సహజంగానే తీపి ఉంటుంది. మామిడికాయల్లాంటివి మాత్రం పుల్లగా ఉంటాయి. అలాంటి వాటికి కాస్త ఉప్పు, కారం చల్లుకొని తినడం మనకు అలవాటు. అయితే కొన్ని పండ్ల మీద ఉప్పు కారం చల్లుకుని తింటే మంచిదే అంటున్నారు వైద్యులు.
2/7ఇటీవల జామకాయలు, పుచ్చకాయలు కట్ చేసుకొని వాటి మధ్య సాల్ట్ వేసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల పండ్ల రుచి పెరుగుతుంది.
3/7మనకు తెలియకుండా పండ్లపై బ్యాక్టీరియా చేరుతుంది. ఆ బ్యాక్టీరియాను ఉప్పు చంపేస్తుంది. అలా అని అన్ని రకాల పండ్లపైనా ఉప్పు చల్లుకొని తినడం కూడా మంచిది కాదు.
4/7ముఖ్యంగా డయాబెటిస్‌తో బాధపడేవారు ఉప్పు చల్లుకొని తినడం కరెక్టు కాదు. పైగా ఉప్పు ఎక్కువగా చల్లుకుంటే బీపీ, గుండెజబ్బులు, కిడ్నీ వ్యాధులు తప్పవు.
5/7అత్యంత పుల్లగా ఉండే సిట్రస్ జాతి పండ్ల మీద(ఉసిరికాయ, పుల్ల మామిడి, నారింజ) వంటి వాటి మీద ఉప్పు చల్లుకొని తింటే కడుపులో ఉత్పత్తి అయ్యే యాసిడ్లను అడ్డుకోవచ్చు. ఫలితంగా అజీర్తి సమస్యలకు చెక్ పెట్టినట్లు అవుతుంది.
6/7జామకాయ మీద ఉప్పు చల్లుకొని తింటే దంతాలకు మేలు జరుగుతుంది. నోట్లో బ్యాక్టీరియా చచ్చిపోతుంది.
7/7పుచ్చకాయ మీద ఉప్పు చల్లినా చల్లకున్నా ఏమీ తేడా ఉండదు. కానీ బీపీ, షుగర్‌తో బాధపడేవారు ఉప్పు చల్లుకోకపోవడమే మంచిది.