ముంబై : నవరాత్రి ఉపవాసం (Navratri 2023) అటు ఆధ్యాత్మికతను జోడిస్తూనే ఇటు ఆరోగ్యాన్ని మెరుగపరిచేలా పాటించడం మేలు. ఉపవాసం అనంతరం అతిగా తినడంతో శరీరంలో కొవ్వు పేరుకుపోయేలా కాకుండా ప్రేవుల ఆరోగ్యం పెంపొందే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఈ విషయంలో అవగాహన కొరవడటంతో మనలో చాలా మంది ఆహారం విషయంలో పొరపాట్లు చేస్తుంటారు.
మనం ప్రధానంగా తీసుకునే మూడు ఆహారాలను దరిచేరనీయకుండా ఆరోగ్యకర ప్రత్యామ్నాయాలను తీసుకోవాలని న్యూట్రిషనిస్ట్ రషి చౌదరి ఇన్స్టాగ్రాం పోస్ట్లో వెల్లడించారు. ఎక్కువమంది సాబుదానా కిచిడీ తీసుకుంటారు. ఇందులో తక్షణ శక్తిని అందించే పోషకాలున్నా ఫైబర్ పరిమితంగా ఉండటం, క్యాలరీలు అధికంగా ఉండటంతో దీనికి ప్రత్యామ్నాయంగా ఊదలతో చేసిన కిచిడీ తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
ఇక కొవ్వు అధికంగా ఉండే పల్లీలను ప్రతి రెసిపీలో వాడుతుంటారు. వీటికి బదులు బాదం పప్పును ఆయా వంటకాల్లో వాడితే శక్తితో పాటు ఆరోగ్యకర కొవ్వులు, ప్రొటీన్, ఫైబర్ లభిస్తుంది. ఉపవాసం అనగానే ఖాళీ కడుపుతో పండ్లను తీసుకోవడం సరైంది కాదు. వీటి స్దానంలో తక్కువ కార్బోహైడ్రేట్లు, అధిక ప్రొటీన్లతో కూడిన గ్రనోలా తీసుకోవడం మేలు.
Read More :