New Study : గంజాయి తాగడం, తినడం, పీల్చడం ఇలా ఏ రూపంలోనైనా దాన్ని తీసుకుంటే గుండె పోటు, స్ట్రోక్ ముప్పు అధికమని తాజా అధ్యయనం స్పష్టం చేసింది. 4,30,000 మందిపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. అమెరికాలో గంజాయి వాడకాన్ని నిషేధించినా వాషింగ్టన్ డీసీతో పాటు 24 రాష్ట్రాల్లో దీని వాడకం చట్టబద్ధం కావడం గమనార్హం.
ఇక గంజాయి వాడటకం గత కొన్నేండ్లుగా పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. భారత్లో గంజాయి, చరస్, హాషిష్ వంటి మత్తు పదార్ధాల వాడకాన్ని నిషేధించారు. గంజాయి వాడకంతో ముఖ్యంగా కార్డియోవాస్కులర్ వ్యాధి ముప్పు అధికమవుతుందని అధ్యయన రచయిత, బోస్టన్, మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్లో డేటా అనలిస్ట్ అబ్రా జెఫర్స్ పేర్కొన్నారు.
గంజాయి వాడకంతో హృద్రోగ సమస్యల ముప్పు పెరుగుతున్న విషయాన్ని అర్ధం చేసుకోవాలని ఆయన తెలిపారు. 2016 నుండి 2020 వరకు సర్వే డేటాను ఉపయోగించి ఈ అధ్యయనం నిర్వహించారు. గంజాయి వినియోగం గుండె జబ్బులు, గుండెపోటు, స్ట్రోక్తో సంబంధంపై ఈ అధ్యయనం దృష్టి సారించింది.
Read More :