న్యూఢిల్లీ : స్కిజోపెనియా, పార్కిన్సన్ వంటి నాడీసంబంధ వ్యాధులను ఆరంభ దశలోనే గుర్తించే డోపమైన్ సెన్సర్ను ఐఐటీ రూర్కీ శాస్త్రవేత్తల బృందం అభివృద్ధి చేసింది. ఈ వ్యాధుల నుంచి వ్యక్తి బాధపడుతుంటే సదరు వ్యక్తి బ్రెయిన్లో డోపమైన్ రసాయనంలో మార్పులు జరుగుతాయి.
డోపమైన్ లెవెల్స్ను కొలిచే సెన్సర్ను శాస్త్రవేత్తలు కనుగొనడం ద్వారా ఆయా వ్యాధులను తొలి దశలోనే గుర్తించే వెసులుబాటు లభించింది. ఈ తరహా వ్యాధులను పూర్తిగా నయం చేయలేకపోయినా ముందుగానే గుర్తించడంతో వ్యాధి ముదరకుండా చూడవచ్చు. ఈ దిశగా ఐఐటీ రూర్కీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన సెన్సర్ వైద్య రంగంలో కీలక పాత్ర పోషించనుంది.
జనాభాలో పెద్దసంఖ్యలో ప్రజలు మానసిక అస్వస్ధతతో బాధపడుతున్న క్రమంలో తొలిదశలోనే నాడీ సంబంధ వ్యాధులను గుర్తించే సెన్సర్ను అభివృద్ధి చేసిన పరిశోధనా బృందాన్ని అభినందిస్తున్నానని ఐఐటీ రూర్కీ డైరెక్టర్ అజిత్ కే చతుర్వేది పేర్కొన్నారు. గ్రెపీన్ క్వాంటంను సల్ఫర్, బరోన్లతో కలిపి ఐఐటీ రూర్కీ బృందం ఈ పరికరాన్ని అభివృద్ధి చేసింది. అధ్యయన వివరాలు ప్రతిష్టాత్మక నేచర్ సైంటిఫిక్ రిపోర్ట్స్లో ఇటీవల ప్రచురితమయ్యాయి.