Antibiotics | న్యూఢిల్లీ: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. కొవిడ్ బారిన పడిన పెద్దల చికిత్సకు లొపినావిర్-రిటోనావిర్, హైడ్రాక్సిక్లోరోక్విన్, ఐవెర్మెక్టిన్, మోల్నుపిరవిర్, ఫావిపిరావిర్, అజిత్రోమైసిన్, డాక్సీసైక్లిన్ ఔషధాలు వినియోగించవద్దని ఆదేశాలిచ్చింది. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటే తప్ప యాంటీ బయాటిక్స్ వాడొద్దని సూచించింది.
ప్లాస్మా థెరఫీ కూడా చేయవద్దని సూచించింది. వ్యాధి తీవ్రత మధ్యస్తంగా లేదా తీవ్రంగా ఉంటే, రోగి ఆక్సిజన్ సహాయంతో ఉంటే ఐదు రోజుల పాటు రెమెడిసివిర్ వాడొచ్చని పేర్కొన్నది. వ్యాధి లక్షణాలు ప్రారంభమైన 10 రోజుల్లోపే వినియోగించాలని, ఐఎంవీ, ఎక్మో మీద ఉన్న వారికి ఇవ్వొద్దని సూచించింది. ఐసీయూలో చేర్చిన 24-48 గంటల్లో టోసిలిజుమాబ్ వినియోగించవచ్చని సూచించింది.