ఇవాళ అంతర్జాతీయ ఎపిలెప్సీ దినోత్సవం
నాడీవ్యవస్థపై ప్రభావం చూపేదే మూర్ఛ వ్యాధి. మెదడులో నియంత్రణ లేకుండా విద్యుత్తు విడుదల కావడం వల్లనే మూర్చ వస్తుంది. ఒక వ్యక్తికి రెండు కన్నా ఎక్కువ సార్లు మూర్చ వస్తేనే ఆ వ్యక్తిని మూర్చ వ్యక్తిగా గుర్తిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5 కోట్ల మంది దీని బారిన పడ్డారు. వీరిలో 6 లక్షల మంది భారతదేశంలో ఉన్నారు. మన దేశంలో ప్రతి వేయి మందికి పది మంది ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి.
ఇది తీవ్రమైన మెదడు రుగ్మత. ఏ వయస్సులోనైనా సంభవించవచ్చు. పుట్టకముందే పిల్లల మెదడుకు ఏదైనా నష్టం జరిగినట్లయితే లేదా పుట్టినప్పుడు ఆక్సిజన్ తగ్గిపోయినా మూర్చ వస్తుంది. అలాగే మెదడు గాయపడటంతో కూడా మూర్చ వేధిస్తుంది. మూర్ఛ రావడానికి కారణం మెదడులో సంకోచం లేదా జన్యుపరంగా కూడా కావచ్చు.
అపోహలు.. వాస్తవాలు..
ఇవీ జాగ్రత్తలు..