హైదరాబాద్: సాధారణంగా అందరూ తమ జీవితంలో ఏదో ఒక సమయంలో చిన్నచిన్న అనారోగ్య సమస్యల బారినపడుతుంటారు. అయితే, ఇలాంటి అనారోగ్య సమస్యలకు ఔషధాలే అక్కర్లేదు. చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. సమస్యను బట్టి వంటింటి పదార్థాలు, పండ్లు, కూరగాయలు ఇలాంటి సమస్యల పరిష్కారానికి తోడ్పడుతాయి. అయితే, మలబద్ధకం సమస్యకు అరటిపండు మంచి ఔషధంగా పనిచేస్తుంది.
అరటిపండులో కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది సులభంగా జీర్ణం కూడా అవుతుంది. అందుకే డాక్టర్లు రోజూ ఒక అరటిపండు తినాలని చెబుతారు. ఈ అరటిపండు అజీర్తిని పోగొట్టి శరీరానికి మేలు చేస్తుంది. అందుకే హిందూ సంప్రదాయంలో ఏ శుభకార్యం జరిగినా భోజనంతోపాటు ఈ పండును కూడా ఇస్తుంటారు. అంతేకాదు ఈ పండుతో ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందామా..?
అరటిపండుతో ఇవీ లాభాలు..