saffron | కుంకుమ పువ్వు.. దీన్ని గర్భిణులు రోజూ పాలల్లో తీసుకుంటే పుట్టబోయే పిల్లలు ఎర్రగా పుడతారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. చాలామందికి ఇది మాత్రమే తెలుసు. గర్భిణులు మాత్రమే కుంకుమ పువ్వు తినాలని అనుకుంటుంటారు. కానీ కుంకుమ పువ్వు ఎవరైనా తినొచ్చని చాలామందికి తెలియదు. కీళ్ల నొప్పులు తగ్గించడంతో పాటు నిద్ర లేమి, డిప్రెషన్, అంగస్తంభన సమస్యలు.. ఇలా చాలా వాటికి ఇది ఔషధంగా పనిచేస్తుంది. కుంకుమ పువ్వులో ఉన్న మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఒకసారి చూద్దామా..
చర్మానికి నిగారింపు తీసుకురావడంలో కుంకుమ పువ్వు కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఎలాంటి క్రీంలు వాడుకుండానే సహజసిద్ధంగా మన చర్మం మెరిసేలా చేస్తాయి. చర్మంపై మొటిమలు తగ్గించడంలోనూ ఇది దోహదపడుతుంది.
ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలోనూ కుంకుమ పువ్వు ఉపయోగపడుతుంది. ఇందులో పైటోకెమికల్స్, ఫెనోలిక్ కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి మెదడుకు అవసరమైన సెరోటోనిన్ను అందించడంలో సహాయపడుతాయి. అందువల్ల టెన్షన్ ఎక్కువై డిప్రెషన్లోకి వెళ్తే పాలల్లో దీన్ని కలుపుకుని తాగితే వెంటనే ఒత్తిడి తగ్గుతుంది. మూడ్ కూడా వెంటనే మారిపోతుంది.
రుతుక్రమ సంబంధిత సమస్యలకు కుంకుమ పువ్వు చక్కగా పనిచేస్తుంది. కుంకుమపువ్వు తీసుకోవడం వల్ల అధిక రక్తస్రావం వంటి సమస్య కూడా ఉండదు.
అంగస్తంభన సమస్యలకు
అంగస్తంభన, వీర్య కణాలు తక్కువ ఉన్నవారు రోజూ కుంకుమ పువ్వును తీసుకోవడం వల్ల సత్ఫలితాలు కనిపిస్తాయి. బాదం పాలల్లో కుంకుమ పువ్వును కలిపి తీసుకోవడం వల్ల సెక్స్ సామర్థ్యంతో పాటు సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది.
శరీరంలో ఫ్రీ రాడికల్స్ ఎక్కువైతే కణాలను దెబ్బతీస్తుంది. ఇది ఎక్కువైతే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అయితే ఈ ఫ్రీ రాడికల్స్ పెరగకుండా చూసే యాంటీ ఆక్సిడెంట్లు కుంకమ పువ్వులో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కుంకుమ పువ్వును రోజూ తీసుకోవడం వల్ల క్యాన్సర్ బారిన పడే అవకాశం తగ్గుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.
జీవక్రియను నియంత్రించడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. రోజూ దీన్ని తీసుకోవడం వల్ల ఆకలి అవ్వదు. కొద్దిగా తినగానే కడుపు నిండినట్టు అనిపిస్తుంటుంది. కాబట్టి తక్కువ ఆహారం తీసుకుంటారు. దీనివల్ల బరువు తగ్గుతారు.
పడుకునే ముందు పాలల్లో కుంకుమ పువ్వు కలుపుకుని తాగితే మంచి నిద్ర పడుతుంది. ఇందులో మాంగనీస్ అధికంగా ఉంటుంది. ఇది శరీరానికి ప్రశాంతత చేకూర్చి త్వరగా నిద్రపోయేలా చేస్తుంది. దీంతో నిద్రలేమి సమస్య దూరం అవుతుంది.
కుంకుమ పువ్వులో క్రోసిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది జ్వరాన్ని తగ్గించడంతో పాటు జ్ఞాపకశక్తిని పెంచడంలో దోహదపడుతుంది. పాలల్లో కుంకుమపువ్వు వేసుకుని తాగడం ద్వారా ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతుంది.
కుంకుమ పువ్వులో క్రోసిటిన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. ఫలితంగా హృద్రోగాలు వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది.
కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ సమస్యలను తగ్గించడంలోనూ కుంకుమ పువ్వు సహాయపడుతుంది. ఆస్తమా, కోరింత దగ్గు ఇలా పలు సమస్యలను తగ్గించడంలోనూ ఉపయోగపడుతుంది.
చిటికెడు కుంకుమ పువ్వును గోరువెచ్చని నీళ్లు లేదా గోరువెచ్చటి పాలల్లో వేయాలి. తక్షణమే రంగు మారితే అది అసలైనది కాదు. ఎందుకంటే అసలైన కుంకుమపువ్వు మిశ్రమం ఎరుపు నుంచి బంగారు రంగుకు రావడానికి కనీసం 15 నిమిషాల సమయం పడుతుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
రోగ నిరోధక శక్తి పెంచే జ్యూస్లు ఇవే..
టీవీ చూస్తూ స్నాక్స్ తింటున్నారా.. జాగ్రత్త..!
మీలో రక్తహీనత ఉందని తెలిపే లక్షణాలు ఇవే..!
పసుపు పాలు తాగితే ఎన్ని లాభాలో..!