న్యూఢిల్లీ : కొవిడ్-19 బారినపడిన వారు సత్వరమే కోలుకునేందుకు సమతుల పోషకాహారానికి మించింది లేదని నిపుణులు చెబుతున్నారు. ఇన్ఫెక్షన్తో శరీరంలో శక్తి సన్నగిల్లడం, కండరాల క్షీణతతో బలహీనత, విపరీతమైన అలసట ఆవహిస్తాయి. సమతుల ఆహారంతో ఈ ఇబ్బందులను అధిగమించవచ్చు. విటమిన్ సీతో కూడిన ఆహారం అధికంగా తీసుకుంటే ఇన్ఫెక్షన్తో పోరాడటమే కాకుండా యాంటీబాడీలు ప్రేరేపితమై రోగ నిరోధక వ్యవస్ధ బలపడుతుంది.
ఆరంజ్, పపాయా, జామ, స్ట్రాబెర్రీస్, టమాటాలు, బ్రకోలీ, కివీ అధికంగా తీసుకోవాలని వాకార్డ్టీ హాస్పిటల్స్ కన్సల్టెంట్ డాక్టర్ బిపిన్ జిబ్కటే సూచించారు. తగినంత ప్రొటీన్ను కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి. తాజా పండ్లు, కూరగాయలు, పాలు, గుడ్లు తీసుకోవాలి. తగినంత నీరు, కొబ్బరినీళ్లు తరచూగా తీసుకుంటే ప్రొబయాటిక్స్ సమకూరి ఇమ్యూనిటీ మెరుగవుతుంది. స్నాక్స్ విషయానికి వస్తే తృణధాన్యాలు, స్ర్పౌట్స్తో పాటు బ్రేక్ఫాస్ట్లో గుడ్లు, రోజుకొక పండు చొప్పున తీసుకోవాలి.
కొవిడ్ నుంచి కోలుకునే సమయంలో లస్పీ, ఆమ్లా జ్యూస్, పాలకూర వంటి ఆకుకూరలు, క్యాబేజ్ వంటివి తీసుకుంటే రోగనిరోధక శక్తి పుంజుకుంటుంది. సాల్మన్, ట్యూనా చేపల్లో ఉండే విటమిన్ ఏ, విటమిన్ బీ వాపు ప్రక్రియను నివారిస్తాయి. కొవిడ్-19 ఇన్ఫెక్షన్ శరీరాన్ని శక్తిహీనం చేసి జీర్ణ ప్రక్రియను నెమ్మదింపచేయడంతో ఇమ్యూనిటీని తిరిగి సమకూర్చుకోవడం కీలకమని అందుకు అనుగుణమైన సమతుల ఆహారాన్ని తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.