(Dengue D2 Variant) కొవిడ్-19 మహమ్మారి నుంచి ఇంకా కోలుకోక ముందే.. మరో సమస్య దాడికి సిద్ధమైంది. మన దేశంలోని 11 రాష్ట్రాల్లో డెంగ్యూ కొత్త వేరియంట్ ఇప్పుడు భయబ్రాంతులకు గురిచేస్తున్నది. అన్ని రాష్ట్రాల్లో డెంగ్యూ కేసులు పెరుగుతున్నట్లు ఆరోగ్య శాఖ నివేదికలు సూచిస్తున్నాయి. జూలై వరకు దేశవ్యాప్తంగా 14,000 కంటే ఎక్కువ డెంగ్యూ కేసులు, 4 మరణాలు నమోదయ్యాయని నివేదికలు చెప్తున్నాయి. ఢిల్లీలో డెంగ్యూ కేసుల సంఖ్య ఆరేండ్లలో అత్యధికంగా నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్లో ఇప్పటి వరకు 6,000 కి పైగా కేసులు వచ్చినట్లు అధికారిక లెక్కల ద్వారా తెలుస్తున్దని. పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, గుజరాత్, తెలంగాణ, పంజాబ్ వంటి రాష్ట్రాలలో కూడా డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి.
డెంగ్యూ D2 వేరియంట్ ఇతర వేరియంట్ల కంటే ప్రమాదకరమైనదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. డెంగ్యూ బారిన పడకుండా ఉండటం మన చేతుల్లోనే ఉన్నది.
ఎక్కువ కాలం నిల్వ చేసిన నీటిని తాగడం మానుకోవాలి. పగటి పూట దోమలు ఎక్కువగా దాడి చేస్తున్నందున.. చేతులు, కాళ్లను పూర్తిగా కప్పి ఉంచేలా దుస్తులు ధరించాలి. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. నిత్యం వేడివేడి ఆహారాలను తీసుకోవాలి. దోమలు పెరుగకుండా ఉండేందుకు నిల్వ నీటిలో కిరోసిన్ చల్లాలి. ఇంటి చుట్టూ వర్షపు నీరు నిల్వ కాకుండా ఉండేందుకు పాత టైర్లు, పగిలిపోయిన కుండలు, ఇంటి ముందు రోడ్డుపై గుంతలు లేకుండా చూసుకోవాలి. పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి.
డీ2 వేరియంట్ ఇతర డెంగ్యూ వేరియంట్ల బలమైన వెర్షన్. అందుకని ముందస్తు చికిత్స మరణాల నుంచి బయటపడేలా చేస్తుంది. డీ 2 వేరియంట్ సోకిన వారిలో తీవ్రంగా జ్వరం, వాంతులు, కీళ్ల నొప్పులు కనిపిస్తాయి.
డెంగ్యూ జ్వరం ప్రమాదకరమైనది. ఇది రక్తస్రావ జ్వరం రావడానికి దారితీస్తుంది. రెండోసారి వైరస్ బారిన పడినట్లయితే మరణం సంభవిస్తుందని గుర్తుంచుకొని నివారణోపాయాలపై దృష్టిపెట్టాలి. డీ2 వేరియంట్ సోకినట్లయితే.. ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి. నీరు లేదా ఇతర ద్రవాలను తీసుకోవడం ద్వారా శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచాలి. అనాల్జెసిక్స్, ఆస్పిరిన్ వంటి మందులు తీసుకోకుండా చూడాలి. స్వయంగా మందులు వాడకుండా వైద్యుడిని సంప్రదించి తగు చికిత్స తీసుకోవాలి.
మరో 3 రోజుల్లో దుబాయ్ ఎక్స్పో
క్రీడలతో పిల్లల్లో డిప్రెషన్కు చెక్.. మాంట్రియల్ పరిశోధన
ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్పై మరోసారి దాడి
అనుకోకుండా ఆవిష్కృతమైన యాంటీబయోటిక్స్
సరిహద్దులో క్రియాశీలకంగా చైనా.. మాడ్యులర్ కంటైనర్ల ఏర్పాటు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..