Corona exercise : కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తున్నది. ఇలాంటి సమయంలో శారీరకంగా ఆరోగ్యంగా ఉంటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు కాదు. మానసికంగానూ దృఢంగా ఉన్న వారే సంపూర్ణ ఆరోగ్యవంతులు. అంటే జీవితంలో ఎదురయ్యే సమస్యలను తట్టుకొని నిలబడడం, శ్రమను, ఒత్తిడిని తట్టుకొనే శక్తిని, మేధో పరిపక్వతను సాధించడం. కోపం, ప్రేమ, నవ్వు తదితర భావాలను అదుపులో పెట్టుకొనే సామర్థ్యాన్ని కలిగి ఉండడం. వాటిలో ఏ ఒక్కటి అదుపు తప్పినా అది మానసిక అనారోగ్యానికి దారితీస్తుంది. మానవుడిని ఒత్తిడిలోకి తోసి శక్తి సామర్థ్యాన్ని నిర్వీర్యం చేసి అధోపాతాళానికి తోస్తుంది. చివరకు అది ప్రాణాలకే ముప్పుగా వాటిల్లుతుంది. ప్రస్తుతం యావత్ సమాజం ఇలాంటి మానసిక ఒత్తిడికి గురవుతున్నది. ప్రతి ఒక్కరూ కరోనా విలయతాండవానికి బిక్కుబిక్కుమంటున్నారు. వైరస్ సోకడం కంటే.. దాని ఒత్తిడి వల్లనే చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని నిపుణులు, వైద్యులు తెలుపుతుండడం శోచనీయం. ఒత్తిడిని అధిగమించి ప్రశాంతంగా జీవనం సాగించడంతో పాటు, ప్రస్తుతం కరోనా వల్ల వాటిల్లుతున్న శ్వాసకోశ సంబంధ ఇబ్బందులను కూడా తొలగించుకోవచ్చని సూచిస్తున్నారు. అందుకు ఉపయోగపడే కొన్న ప్రత్యేక ఆసనాలపై ప్రత్యేక కథనం..
ముందుగా రెండు కాళ్లను ముందుకు చాచి, రెండు చేతులను శరీరానికి ఇరుపక్కల పెట్టుకొని దండాసనం వేయాలి. అరచేతులను భుజాల కింద పెట్టి తర్వాత నిదానంగా శ్వాస తీసుకుంటూ నడుమును పైకి లేపాలి. పాదాలను సమాంతరంగా పెడుతూ, కాలి వేళ్లు భూమిని తాకించేందుకు ప్రయత్నించాలి. ఈ ఆసనం గుండెకు, ఊపిరితిత్తుల పనితీరును ఎంతో మెరుగుపరుస్తుంది. అంతేకాదు చేతులు, పాదాలను దృఢంగా మార్చుతుంది.
ముందుగా వజ్రాసనంలో కూర్చోవాలి. పాదాల వేళ్లను దగ్గరగా పెట్టి, మడమలను దూరంగా పెట్టాలి. తర్వాత మెల్లగా శరీరాన్ని వెనక్కి వంచి తలను నేలకు ఆనించాలి. రెండు మోచేతులను శరీరం పక్కగా పెట్టుకోవాలి. తర్వాత తలను నేలకు అనించి శరీరాన్ని పైకి లేపాలి. నిదానంగా శ్వాస తీసుకోవాలి. అలా ఉండగలిగినంత సేపు ఉండి తర్వాత యథాస్థితికి రావాలి.
ముందుగా వజ్రాసనంలో కూర్చోవాలి. పాదాల వేళ్లను దగ్గరగా పెట్టి, మడమలను మాత్రం దూరంగా పెట్టాలి. తరువాత మెల్లగా శరీరాన్ని వెనక్కి వంచి తలను నేలకు ఆనించాలి. రెండు చేతులను కాళ్లమీద పెట్టుకోవాలి. అలా ఉండగలిగినంత సేపు ఉండి తర్వాత యథాస్థితికి రావాలి.
మూడు ఆసనాలు ఊపిరితిత్తులు, పక్కటెముకలకు మంచిశక్తిని ఇస్తుంది. రిబ్ కేజ్ను ఓపెన్ చేసేందుకు పరిపూర్ణ శుప్తవజ్రాసనం ఎంతో ఉపయోగడుతుంది. ఫలితంగా ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది.
శరీరానికి అందే ఆక్సిజన్ పరిమాణాన్ని పెంచుతాయి. ఉదాహరణకు ఆక్సిజన్ లెవల్స్ 70 శాతం ఉన్న ఈ ఆసనాలను చేయడం వల్ల 90శాతానికి మించి లెవల్స్ను పెంచుకోవచ్చు.
ఆస్తమా ఉన్నవారికి ఈ ఆసనాలు ఎంతోమేలు చేస్తాయి.
చేతుల, పాదాలను దృఢంగా మార్చుతుంది. కాలి కండరాలను బలోపేతం చేస్తాయి.
శ్వాసక్రియ రేటును మెరుగుపరచి మనసుకు ఉత్తేజాన్ని కలిగిస్తాయి.
గాలి పీల్చుకునేదానిపై అంటే ఉచ్వాస, నిశ్వాస ప్రక్రియలపై దృష్టిసారించడమే ఈ ఆసనం ప్రత్యేకత. ముందుగా పద్మాసనంలో కూర్చోవాలి. తర్వాత ఊపిరిని దీర్ఘంగా వదలాలి. తర్వాత చేతి బొటనవేలుతో ఒక ముక్కురంధ్రాన్ని మూసివేసి మరో నాసిక ద్వారా ఊపిరిని గట్టిగా పీల్చాలి. ఆ తర్వాత తలను మెల్లగా పైకెత్తాలి. ఇలా చేయడం వల్ల ఎక్కువ మొత్తంలో గాలిని లోపలికి తీసుకునే అవకాశం ఏర్పడుతుంది. కొన్ని క్షణాలపాటు అలాగే ఉండి, తరువాత తలను కిందకు వంచి అంతే నెమ్మదిగా ఊపిరిని వదలాలి. ఇలా సుమారు 10 నుంచి 15 సార్లు చేయాలి. దీనివల్ల ఏకాగ్రత శ్వాసమీదనే కేంద్రీకృతమవుతుంది. ఫలితంగా మెదడు విశ్రాంతి తీసుకొని మనసుకు ప్రశాంతత చేకూరుతుంది.
వజ్రాసనంలో కానీ, పద్మాసనంలో కానీ కూర్చోవాలి. రెండు నాసికాపుటాలను రాపిడికి గురిచేస్తూ వేగంగా గాలిని పీల్చుకోవాలి. ఉండగలిగినంత సేపు ఉండి తరువాత నెమ్మదిగా అదే రాపిడిని కలుగజేస్తూ గాలిని బయటకు వదలాలి. ఇలా చేయడం వల్ల ఊపిరితిత్తులను చేరడానికి ముందే గాలి వేడెక్కుతుంది. ఫలితంగా శరీరశుద్ధి వేగవంతమవుతుంది. జలుబు, ఆస్తమా వంటి ఇబ్బందులు తొలగుతాయి. గురక కూడా తగ్గడమేగాక, శరీరంలోని విషమలినాలన్నింటినీ బయటకు పంపుతుంది. అంతేకాదు ప్రతికూల ఆలోచనలను తగ్గించి మెదడులో అయోమయ ఆలోచనలు లేకుండా చేస్తుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది.
ముందుగా రెండు కాళ్లను ముందుకు చాచి దండాసనంలో కూర్చోవాలి. తరువాత ఒక్కో కాలిని మడచి వెనక్కి తీసుకుంటూ జఘన కిందిభాగంలో ఉంచుకోవాలి. రెండు కాలిబోటనవేళ్లను ఒకదానిమీద ఒకటి పెట్టుకోవాలి. వెన్నెముకను నిటారుగా చేసి, రెండు చేతులను మోకాళ్లపై పెట్టుకోవాలి. ఇప్పుడు నిదానంగా శ్వాస తీసుకోవాలి.
ఇక ఒత్తిడిని జయించేందుకు ప్రాచీనకాలం నుంచి వస్తున్న మరో ప్రక్రియ సహజ సమాధి స్థితి.
ఇందులో ప్రధానంగా నిద్రపోకుండా ఉంటూనే, మనసును ప్రగాఢమైన విశ్రాంతిలోకి తీసుకెళ్లడమే దీని ప్రత్యేకత. తద్వారా మనసును సమతాస్థితిలో ఉంచగలగడం ద్వారా ఒత్తిడిని జయించొచ్చు.
ముందుగా బోర్లా పడుకోవాలి. చాతి పక్కగా రెండు చేతులను పెట్టుకోవాలి. తర్వాత నెమ్మదిగా గాలి పీలుస్తూ అరచేతులపై, పాదాల వేళ్ల మీదనే శరీరాన్ని మీదకు లేపాలి. మెల్లగా గాలి వదులుతూ తలను కుడిభుజం మీదుగా వెనక్కి తిప్పి కాలి మడమలను చూసేందుకు యత్నించాలి. మళ్లీ గాలి పీల్చుతూ తలను ముందుకు తీసుకురాలి.
ఇదే ప్రక్రియను ఎడుమ భుజం మీదుగా కూడా చేయాలి. ఈ ఆసనం ఊపిరితిత్తులను పూర్తిసామర్థ్యంతో పనిచేసేలా చేస్తాయి. ఫలితంగా శరీరానికి ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ అందుతుంది. ఆస్తమా ఉన్నవారికి ఇది ఎంతో ఉపయోగకరం.
మెడనొప్పులు, కీళ్లనొప్పులు, వెన్నుపూస నొప్పులు, గుండెజబ్బులు తదితర వాటితో బాధపడుతున్నవారు ఆసనాలను వేయడం కొంచెం కష్టంతో కూడుకున్న పని. అయితే ఎలాంటి శారీరక ఒత్తిడి కలుగకుండా కూడా శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ లెవల్స్ను పెంచుకునేందుకు పలు చిట్కాలు ఉన్నాయి. నిద్రపోవడం, కూర్చునే విధానంలో మార్పులు చేసుకుంటే సరిపోతుందని నిపుణులు తెలుపుతున్నారు.ఒకే పక్కన ఎక్కువసేపు పడుకోకుండా ప్రతి అరగంటకు ఒకసారి పొజిషన్ మార్చాలని వివరిస్తున్నారు. కుడిభుజం వైపు, ఎడమభుజం వైపు, బోర్లా పడుకోవడం, వెల్లకిలా పడుకోవడం చేయడం ద్వారా అన్ని శరీరభాగాలకు ఆక్సిజన్ సరఫరా అవుతుందని తెలుపుతున్నారు.