ఫిట్నెస్కు ప్రాధాన్యతనిచ్చే కథానాయికల్లో పంజాబీ సుందరి రకుల్ప్రీత్సింగ్ ముందువరుసలో ఉంటుంది. ఎఫ్45 పేరుతో ఆమె సొంత ఫిట్నెస్ శిక్షణ సంస్థల్ని నడుపుతున్న విషయం తెలిసిందే. తన సోషల్మీడియా ఖాతాల్లో తరచూ శారీరక వ్యాయామాలు, యోగాకు సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తూ అభిమానుల్ని ఉత్సాహపరుస్తుంటుంది రకుల్. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఫిట్నెస్ తాలూకు అపోహలు, వాస్తవాలపై అభిప్రాయాల్ని వెల్లడించింది రకుల్. ఆమె మాట్లాడుతూ ‘ ఫిట్నెస్ కొందరికి మాత్రమే అవసరమనే భావన ఉంది.
వృత్తులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ శారీరక వ్యాయామానికి ప్రాధాన్యతనివ్వాలి. బ్రతకడానికి శ్వాస ఎంత ముఖ్యమో రుగ్మతలు లేని శరీరానికి వ్యాయామం అంతే ముఖ్యం. జిమ్, యోగా, ఆటలు, సైక్లింగ్…ఇవన్నీ ఫిట్నెస్ పరిధిలోకే వస్తాయి. చాలా మంది తాము కోరుకున్న శరీరసౌష్టవంతో సిక్స్ప్యాక్ చేయడమే ఫిట్నెస్ అనే భ్రమలో ఉంటారు.
మన శరీరంలో ఎనర్జీ లెవల్స్ను బలంగా ఉంచుకోవడం..శరీరాన్ని అన్ని అంశాల్లో కండీషన్గా ఉంచుకోవడమే నిజమైన ఫిట్నెస్. అందుకే నేను ఒకే ఫార్మాట్ వ్యాయామానికి పరిమితం కాను. వెయిట్ లిఫ్టింగ్తో పాటు యోగా, సైక్లింగ్, స్పోర్ట్స్ అడ్వెంచర్స్తో ఫిట్గా ఉండేందుకు ప్రయత్నిస్తా’ అని చెప్పింది.