న్యూఢిల్లీ : బయటకు అడుగుపెడితే వాతావరణ కాలుష్యం కోరలు చాస్తుంటే ఇక ఏం తినాలన్నా ఆహారం కల్తీమయమవుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. పిల్లలు ఇష్టంగా తినే చాక్లెట్స్లోనూ ప్రమాదకర పదార్ధాలున్నాయని తాజా సర్వే (New Study) బాంబు పేల్చింది. డార్క్ చాక్లెట్ బార్ సహా పలు చాక్లెట్స్లో మెటల్ కంటెంట్ అధికంగా ఉంటోందని వెల్లడైంది. లీడ్, కాడ్మియం వంటి పదార్ధాలు వీటిలో ఉన్నాయని, దీర్ఘకాలం వీటిని వాడితే తీవ్ర అనారోగ్య సమస్యలు వెంటాడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇక కేవలం మిల్క్ చాక్లెట్ బార్స్లోనే అధికంగా లోహాలు లేవని వెల్లడైంది. తాము పరీక్షించిన చాక్లెట్ ఉత్పత్తుల్లో మూడింట ఓ వంతు చాక్లెట్స్లో లీడ్, కాడ్మియమ్ లెవెల్స్ ఆందోళనకరంగా ఉన్నాయని గుర్తించామని లాభాపేక్ష లేని వినియోగదారుల సలహా మండలి కన్జూమర్ రిపోర్ట్స్ పరిశోధన తెలిపింది. అమెరికాలో అతిపెద్ద చాక్లెట్ తయారీ కంపెనీ హెర్షీని తమ ఉత్పత్తుల్లో ఈ హెవీ మెటల్స్ వాడకాన్ని తగ్గించాలని సంస్ధ కోరింది.
డార్క్ చాక్లెట్ బార్స్, మిల్క్ చాక్లెట్ బార్స్, కకోవా పౌడర్, చాక్లెట్ చిప్స్, బ్రౌనీస్, చాక్లెట్ కేక్ సహా ఏడు విభాగాల్లో 48 ఉత్పత్తులను ఈ అధ్యయనంలో భాగంగా పరీక్షించగా 16 ప్రోడక్ట్స్లో లీడ్, కాడ్మియం లెవెల్స్ ప్రమాదకరంగా ఉన్నాయని వెల్లడైంది. ఇక కేవలం మిల్క్ చాక్లెట్ బార్స్లోనే మెటల్ కంటెంట్ అధికంగా లేనట్టు గుర్తించారు.
Read More :