AIIMS : కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో రోగనిరోధక శక్తి తగ్గుముఖం పట్టడంతో వైరల్ ఇన్ఫెక్షన్లు, చర్మ సమస్యలు, అపెండిసైటిస్ వంటి రుగ్మతలు పెరుగుతున్నాయని ఎయిమ్స్ ఢిల్లీ పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ శిల్పా శర్మ పేర్కొన్నారు.
కోవిడ్ బారినపడటం, వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం ప్రజల్లో ఇమ్యూనిటీ తగ్గిందని, అందుకే వైరల్ ఇన్ఫెక్షన్లు, జలుబు వంటివి మూడు, నాలుగు రోజులు మించి వెంటాడుతున్నాయని అన్నారు. డీహైడ్రేషన్ కారణంగా రక్తం గడ్డ కట్టిన కేసులు కూడా పెరుగుతున్నాయని తెలిపారు. జిమ్ల్లో అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిన ఉదంతాల గురించి మనం వింటూనే ఉన్నామని చెప్పారు.
ఇక గర్భధారణ సమయంలో ఫోలిక్ యాసిడ్ ప్రాముఖ్యత గురించి డాక్టర్ శిల్పా వివరిస్తూ, పిండం అభివృద్ధిలో ఫోలిక్ యాసిడ్ చాలా ముఖ్యమైనదని, తల్లి గర్భం దాల్చడానికి కనీసం మూడు నెలల ముందు ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలని అన్నారు. తండ్రి కూడా ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం ముఖ్యమని ఆమె సూచించారు.
Read More :
Marriage | 17 మంది మనుమలు, మనుమరాళ్లకు ఒకేసారి పెండ్లి..! ఒకే శుభలేఖ..!!