న్యూయార్క్ : లంగ్ క్యాన్సర్ నుంచి మరణాల ముప్పును 50 శాతం తగ్గిస్తూ వినూత్న ఆవిష్కరణగా ముందుకొచ్చిన నూతన ట్యాబ్లెట్ (Wonder Pill) ఆశలు రేకెత్తిస్తోంది. పదేండ్ల పాటు ప్రపంచవ్యాప్తంగా చేపట్టిన క్లినికల్ ట్రయల్స్లో సానుకూల ఫలితాలు రావడంతో ఈ వండర్ పిల్ క్యాన్సర్ రోగుల్లో ఆశాకిరణంలా మారింది. చికాగోలో జరిగిన అమెరికన్ సొసైటీ ఆఫ్ క్లినికల్ ఆంకాలజీ వార్షిక సమావేశంలో వెల్లడించిన సర్వే ఫలితాల్లో ఈ విషయం వెలుగుచూసింది.
టాగ్రిసోగా మార్కెట్ కానున్న ఓసిమెర్టినిబ్ అనే డ్రగ్ లంగ్ క్యాన్సర్ రోగుల్లో ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు గుర్తించారు. కాగా, ఈ మందును ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసింది. క్యాన్సర్ మరణాల్లో అత్యధికంగా లంగ్ క్యాన్సర్ మరణాలు నమోదవుతుండగా ఏటా 18 లక్షల మంది లంగ్ క్యాన్సర్తో మృత్యువాతన పడుతున్నారు.
ఈ రోగులకు ఉపశమనంగా 30 ఏండ్ల కిందట మన ఏం చేయలేకపోయేవారమని అధ్యయన రచయిత, యేల్ క్యాన్సర్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రాయ్ హెర్బస్ట్ పేర్కొన్నారు. లంగ్ క్యాన్సర్ చికిత్సలో ఇప్పుడు ఈ ఔషధం ముందుకొచ్చిందని, థెరఫీలకు లొంగని లంగ్ క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల్లో యాభై శాతం మరణాలను తగ్గించే అద్భుతమైన ఔషధం ఇదని చెప్పారు. ఈ మందును 26 దేశాల్లోని రోగులపై పరీక్షించామని తెలిపారు.
Read More