-పంచాయత్ యువ క్రీడా ఔర్ ఖేల్ అభియాన్ (పీవైకేకేఏ) పథకాన్నే రాజీవ్గాంధీ ఖేల్ అభియాన్ అని పిలుస్తున్నారు.
-గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించేందుకు, యువ క్రీడాకారులకు మౌలిక వసతులు, ప్రోత్సాహం కల్పించేందుకు కేంద్ర మత్రిమండలి 2008 మార్చి 10న ఈ పథకానికి ఆమోదం తెలిపింది
-ఈ పథకం 2008 ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది.
-కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఈ పథకంలో మూడు నిర్ణాయక మండళ్లు ఉంటాయి.
-కేంద్ర క్రీడాశాఖ మంత్రి అధ్యక్షతన జనరల్ కౌన్సిల్ ఉంటుంది.
-క్రీడాశాఖ కార్యదర్శి అధ్యక్షతన కార్యనిర్వహణ కమిటీ ఉంటుంది.
-క్రీడాశాఖ సంయుక్త కార్యదర్శి అధ్యక్షతన మిషన్ డైరెక్టరేట్ ఉంటుంది.
-గ్రామీణ ప్రాంతాల్లో క్రీడల అభివృద్ధికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, నెహ్రూ యువ కేంద్ర సంఘటన్, యూనిసెఫ్, ఇతర ఎన్జీవోలతో కలిసి పీవైకేకేఏ పలు కార్యక్రమాలకు రూపకల్పన చేసి అమలుచేస్తుంది.
-ఈ పథకాన్ని క్షేత్రస్థాయిలో ఆయా రాష్ట్రప్రభుత్వా లు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాల యంత్రాంగాలు అమలుచేస్తాయి.
-ఈ పథకానికి నిధులను ఈశాన్య రాష్ర్టాల్లో కేంద్ర ప్రభుత్వం 90 శాతం భరిస్తుంది. ఇతర ప్రాంతాల్లో 75-25 శాతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి.
-ఈ పథకానికి 11, 12 పంచవర్ష ప్రణాళికల కాలంలో దాదాపు రూ. 6000 కోట్లు కేటాయించారు.