అలంపూర్: నవబ్రహ్మాలయాల్లో ప్రధాన ఆలయమైన జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో ఉద్యోగులు, వ్యాపారులు బంధుమిత్ర, కుటుంబ సమేతంగా ఆలయాలను దర్శించుకున్నారు.
స్వామి వారి ఆలయంలో అభిషేకాలు, అమ్మవారి ఆలయంలో కుంకుమార్చనలు మొదలగు పూజా కార్యక్రమాలు నిర్వ హించారు. తుంగబద్రా నదిలో నీటి ప్రవాహాన్ని చూసి భక్తులు పరవసించి పోయారు. దేవస్థానం అన్నదాన సత్రంలో అన్న పసాదాలు స్వీకరించారు.