జాతీయస్థాయికి జట్టు ఎంపిక
ములుగు జిల్లాలో సెపక్తక్రాను పరిచయం చేయడం అభినందనీయం
ఎస్పీ డాక్టర్ సంగ్రామ్సింగ్ జీ పాటిల్
ములుగు రూర ల్, మార్చి17: ము లుగు జిల్లా కేంద్రం లో నిర్వహించిన 7వ జూనియర్ రా ష్ట్ర స్థాయి సెపక్తక్రా పోటీలు ముగిశాయి. నల్లగొండ, నిజామాబాద్, రంగారెడ్డి, వరంగల్, కామారెడ్డి, మహబూబ్నగర్, ఖమ్మం, అదిలాబాద్, కరీంనగర్, హైదరాబాద్, మెదక్, ములుగు జిల్లాలకు చెందిన జట్లు తలపడ్డాయి. బాలుర విభాగంలో రంగారెడ్డి జట్టు మొదటి స్థానం, నిజామాబాద్ 2వ స్థానం, హైదరాబాద్, కామారెడ్డి జట్లు 3వ స్థానంలో నిలిచాయి. బాలికల విభాగంలో నిజామాబాద్ మొదటి స్థానం, రంగారెడ్డి 2వ స్థానం, హైదరాబాద్, కామారెడ్డి 3వ స్థానంలో నిలిచాయి. రెండు రోజులుగా నిర్వహించిన ఈ సెపక్తక్రా పోటీల్లో గెలుపొందిన విజేత జట్లకు ఎస్పీ ట్రోఫీని, మెమెంటోలను అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ డాక్టర్ సం గ్రామ్సింగ్ జీ పాటిల్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాల్లో 2శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించే సెపక్తక్రాను ములుగు జిల్లాలో నిర్వహించి విద్యార్థులకు క్రీడపై ఆసక్తి కనబర్చేలా చేయడం ఎంతో అభినందనీయమని అన్నారు. విద్యార్థి దశలో క్రీడలతో మానసిక ఉల్లాసం పెరిగి అన్ని రంగాల్లో రాణించే అవకాశం ఉందని అన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ సాయిచైతన్య, సెపక్తక్రా అసోసియేషన్ నాయకులు ప్రేమ్రాజ్, గోవింద్నాయక్, బానోత్ సమ్మయ్య, శ్రీనివాస్రెడ్డి, సం జీవరెడ్డి, శిరీష్రెడ్డి, జితేందర్నాథ్, రాహుల్నాయక్, రా మకృష్ణ, అనిల్కుమార్, పీవీ చారి, కోచ్లు పాల్గొన్నారు.