‘అతిథులను దేవుడిలా భావించే ఓ యువకుడి కథ ఇది. అతడి జీవితంలోకి వచ్చిన ముఖ్యమైన అతిథులు ఎవరన్నది ఉత్కంఠను పంచుతుంది’ అని అన్నారు పొలిమేర నాగేశ్వర్. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘అతిథిదేవోభవ’. ఆది సాయికుమార్, నువేక్ష జంటగా నటించారు. రాజబాబు మిర్యాల, అశోక్రెడ్డి మిర్యాల నిర్మించారు. ఈ నెల 7న విడుదలకానుంది. మంగళవారం హైదరాబాద్లో పొలిమేర నాగేశ్వర్ పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘దర్శకుడిగా నా మొదటి సినిమా ఇది. గతంలో కె.విశ్వనాథ్, రాజమౌళి, వి.వి.వినాయక్లవద్ద దర్శకత్వశాఖలో పనిచేశా. నిర్మాత రాజబాబు చెప్పిన కథలోని కొత్తదనం నచ్చడంతో సినిమా చేయడానికి అంగీకరించా. ప్రేమ, యాక్షన్తో పాటు చక్కటి థ్రిల్ను పంచే చిత్రమిది. ప్రతిక్షణం హీరో భయంతో బతుకుతుంటాడు. ఆ భయం వెనకున్న కారణమేమిటన్నది ఆసక్తిని రేకెత్తిస్తుంది. హీరోగా ఆదిని కొత్త పంథాలో ఆవిష్కరిస్తుంది. శేఖర్ చంద్ర స్వరపరచిన పాటలతో పాటు ట్రైలర్కు చక్కటి స్పందన లభిస్తున్నది. అవకాశం దొరికితే నా గురువు, దర్శకుడు రాజమౌళికి నా సినిమా చూపించాలనుంది’ అని తెలిపారు.