సప్తగిరి కథానాయకుడిగా ఏ.ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్నది. రిగ్వేద క్రియేషన్స్ పతాకంపై ఎ.ఎస్.రిగ్వేద చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి ద్వితీయార్థంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానున్నది. నిర్మాత మాట్లాడుతూ ‘వినోదమే పరమావధిగా రూపొందుతున్న చిత్రమిది. సప్తగిరి నుంచి ప్రేక్షకులు కోరుకునే హాస్యంతో పాటు కమర్షియల్ హంగులన్నీ ఉంటాయి. వినూత్న కథాంశంతో తెరకెక్కిస్తాం. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనులు జరుపుతున్నాం’ అని తెలిపారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సిద్ధ మనోహర్.