లంబాడీల జీవనం వైవిధ్య భరితం. వారిని మధుర లంబాడీలు, కాయితి లంబాడీలు, కొప్పు లంబాడీలు, జుట్టు లంబాడీలు అని పిలుస్తుంటారు. జుట్టు లంబాడీలు అంటే వారు అసలు ఒప్పుకోరు. జుట్టు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. బతుకమ్మ ఆ జాతివారికి ఎంతో ప్రీతిపాత్రమైనది. అయితే వారు బతుకమ్మను తీజ్ పేరుతో ఆడుతుంటారు.
వర్షాలు ఆరంభమై వ్యవసాయ పనులు ముమ్మరంగా ఉన్న సమయంలో ప్రకృ తి అద్భుత సౌందర్యంతో అలరారుతూ ఉంటుం ది. అప్పుడే శ్రావణ మాసం వస్తుంది. శ్రావణ మాసం వచ్చిందంటే లంబాడీ తండాల్లో పండు గ సందడి మొదలవుతుంది. వాటిలో ఒకటి తీజ్ అంటే మనం చేసే బతుకమ్మ పండుగ వంటిది. ఈ పండుగ తమ సమూహాల్లో ఎప్పుడు ప్రారం భం అయిందో ఎలా ప్రారంభం అయిందో తెలియదు అంటారు ఆ జాతి పెద్దలు.
తీజ్ పండుగను బంజారా ఆడపిల్లలు భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. తీజ్లో గోధుమ మొలకలు కనిపిస్తాయి.తీజ్ పండుగ మనం చేసే బతుకమ్మ పండుగకు చాలా పోలికలుంటాయి. తెలంగాణలో చేసే బతుకమ్మలాగే తొమ్మిది రోజు ల పండుగ ఇది. ప్రత్యేకంగా పిల్లల పం డుగ. ఆడవారి పండుగ. మరీ ముఖ్యంగా పెళి ్లకాని ఆడపిల్లల సందోహం అంత ఇంత కాదు. రాఖీపూర్ణిమ పండుగకు ఆరు రోజుల ముందు నుంచి తీజ్ పండుగ పనులు మొదలవుతాయి.
మొదటి రోజు ఉదయం గోధుమలు నీళ్లలో నానబెడతారు. ఆ తర్వాత ఆడపిల్లలు అడవికి వెళ్లి మోదుగ ఆకులు తెస్తారు. చెరువు నుండి లేదా పొలాల్లోంచి నల్లమట్టి తీసుకువస్తారు. మోదుగ ఆకులతో దొప్పలు తయారు చేస్తారు.( ఆదిలాబాద్ వైపు వెదురు శిబ్బిలో మట్టి నింపి గోధుమలు చల్లుతారు) దొప్పల్లో తెచ్చిన మట్టి నింపుతారు. అందులో అదే రోజు సాయంత్రం నానబెట్టిన గోధుమ గింజలు చల్లుతారు. ఆ తర్వాత పైన మట్టి వేసి నీళ్లు చల్లుతారు. ఆ దొప్పలు ఇంట్లో పెడతారు. దొప్పలలో అన్నదమ్ముల సంఖ్యను బట్టి అంచెలు అంచెలుగా అలుకుతా రు. ముగ్గురు అన్నదమ్ములుంటే మూడు అంచెలుగా దొప్పలుంటా యి. ప్రత్యేకంగా కనిపిస్తాయి.
నారు పోసిన దగ్గర నుంచి ఎనిమిది రోజులు ఆడపిల్లలు భక్తి శ్రద్దలతో ఆ దొప్పల్లో నీరు చల్లుతారు. ఐదారు రోజులు అయ్యేసరికి గోధుమ మొలకలు వేలెడు ఎత్తున ఎదుగుతాయి. ఆ మొ లకలపై పసుపు నీళ్లు జల్లుతారు. అవి ఆకుపచ్చ పసుపు రంగులో అద్భుతంగా కనిపిస్తాయి. వా టిని వాకిట్లో పెట్టి ఆడపిల్లలు చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ నృత్యం చేస్తారు. చివరి రెండు రోజులు పండుగను ఘనంగా జరుపుకొంటారు.
రాఖీ పండుగ అయిన మూడో రోజు పుట్టమన్ను తెచ్చి గుడి గోపురం ఆకారంలో బతుకమ్మను చేస్తారు. అది చక్కని రూపం రావడానికి 21 పుల్లలు వాడతారు. అందుకోసం మామిడి, పులిజేరి, రేల, మోదుగ, అల్లనేరేడు, ఉత్తరేణి, ఆకుమద్ది /తెల్లమద్ది (అన్నీ ఔషధ మొక్కలే) ఏడు రకాల కర్ర పుల్లలు వాడతారు.
పండుగ చివరి రోజు నాటికి గోధుమ మొలక లు ఐదారు ఇంచులు పెరుగుతాయి. ఇంట్లో ఉన్న మగ పిల్లలు ఈ గోధుమ మొలకల దొప్ప లు వాకిట్లో పెడతారు.
ప్రతి సాయంత్రం తీజ్, గోధుమ మొలకల దొప్పలు మధ్యలో పెట్టి వాటి చుట్టూ తిరుగుతూ వలయాకారంగా తిరుగు తూ ఆడపిల్లలు సాంప్రదాయ నృత్యం హోరియా చేస్తూ సాం ప్రదాయ పాటలు పాడుతూ ఆనందోత్సాహాలతో గడుపుతారు. అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి ఆడపిల్లలు ఈ పండు గ చేస్తారు.
వీ శాంతి ప్రబోధ