సిలబస్ రేషనలైజేషన్ పేరిట జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ సంస్థ (ఎన్సీఈఆర్టీ) పదవ తరగతి జీవశాస్త్ర పుస్తకాల నుంచి డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని తొలగించింది. విద్యార్థులపై సిలబస్ భారాన్ని తగ్గించే పేరిట అత్య ంత ముఖ్యమైన చాప్టర్ను తొలగించడం గర్హనీయం. జీవుల పరిణామం, నూతన జీవుల ఆవిర్భావము, జన్యుశాస్త్రం మొదలయినవాటికి జీవపరిణామ సిద్ధాంతం ఆయువుపట్టు.
2018లో అప్పటి మానవ వనరుల అభివృద్ధి శా ఖామంత్రి సత్యపాల్ సింగ్ డార్విన్ జీవపరిణామ సిద్ధాంతం పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సిద్ధాంతాన్ని తొలగించాలని కోరారు. నాటి ఆయన కోరికను ఎన్సీఈఆర్టీ ప్రస్తుతం తీర్చినట్టున్నది.
అనేక దేశాలలో ఛాందసవాదులు డార్విన్ జీవపరిణామ సిద్ధాంతాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సృష్టి వాదులు ఈ సిద్ధాంతానికి బద్ద వ్యతిరేకం. సౌదీ అరేబియా, ఒమన్, అల్జీరియా, మొరాకో వంటి దేశాలలో డార్విన్ సిద్ధాంతాన్ని నిషేధించారు.సెకండరీ స్కూల్ సిలబస్ నుంచి డార్విన్ సిద్ధాంతం తొలగించడం తిరోగమన చర్య. బాల్య దశలో నేర్చుకోవలసిన ముఖ్యమైన సిద్ధాంతాన్ని సిలబస్ నుండి తొలగించడం వల్ల జీవుల పరిణామం గూర్చి విద్యార్థులు అవగాహన కల్పించుకోలేరు.
మానవాళి మనుగడకు సవాలుగా నిలుస్తున్న అనే క సమస్యలకు జీవ పరిణామ సిద్ధాంతం సమాధానం చూపిస్తుంది. కరోనా లాంటి అనేక మహమ్మారిలు మున్ముందు వచ్చే అవకాశం ఉన్నది…వాటి అంచనా జీవపరిణామ సిద్ధ్దాంతం ఆధారంగానే జరుగుతుంది. ఇప్పటికే భారత దేశంలో సైన్స్ బోధన చాలా లోపభూయిష్టముగా ఉన్నది. సాంప్రదాయ విద్య, నైతిక విద్య పేరుతో శాస్త్రీయంగా నిరూపితమైన అంశాలను మరుగున పడేయడం దురదృష్టకరం.
డార్విన్ సిద్ధాంతాన్ని తొలగించడాన్ని శాస్త్రవేత్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. విద్యావేత్తలు, శాస్త్రవేత్తల సమూహం బ్రేక్ త్రూ సైన్స్ సొసైటీ ఎన్సీఈఆర్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బహిరంగ లేఖ రాసింది. జీవపరిణామ సిద్దాంతం జీవుల పరిణామ క్రమాన్ని విద్యార్థులకు విశదీకరించడంలో కీలక భూమిక పోషిస్తుంది. డార్విన్ సిద్ధాంతం విద్యార్థులలో సునిశిత పరిశీలన, విమర్శనాత్మక ఆలోచనను పెంపొందిస్తుంది.
డార్విన్ సిద్ధాంతాన్ని తొలగించడాన్ని శాస్త్రీయ దృ క్పథం కలిగిన వారందరూ ఖండించాలి. ఈ తొలగింపును అడ్డుకోకపోతే భవిష్యత్తులో అనేక అంశాలను ఇదే విధంగా తొలగించి మళ్ళీ మనల్ని మధ్య యుగాలకు తీసుకుపోయే ప్రమాదమున్నది. చిన్నవయసు నుంచే విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనలు పెంపొందించాలంటే అనేక పరిశోధనల అనంతరం నిరూపితమై న సిద్ధాంతాలు ఖచ్చితంగా సిలబస్లో ఉండేలా చూడాలి. మూఢనమ్మకాలు, అశాస్త్రీయ అంశాలు సిలబస్లో చొప్పిస్తే భవిష్యత్లో సైన్స్ రంగంలో పరిశోధనలు మందగిస్తాయి. శాస్త్ర పరిశోధన రంగంలో ఇప్పటికే మనం ఎంతో వెనుకబడి ఉన్నాం…ఇలాంటి నిర్ణయా ల వల్ల మరింత వెనుకబడిపోతాం. వెంటనే ఈ తొలగింపు నిర్ణయాన్ని మార్చుకుని డార్విన్ జీవపరిణామ సిద్ధాంతాన్ని తిరిగి సిలబస్లో చేర్చాలి.
-డాక్టర్ ఏ. వేణుగోపాల్రెడ్డి