దోపిడిదారుల చేతుల్లో దగా పడుతున్న తెలంగాణ నాడు కొందరికి రాజకీయ నినాదమైంది. రాజకీయంగా వారు ఎదగడానికి తెలంగాణ వాదం బలంగా పనిచేసింది. ‘జై తెలంగాణ’ అని.. ఉన్నత పదవులు రాగానే ‘నై తెలంగాణ’ అన్న నేతలెందరో.. తెలంగాణ వ్యధలను దూరం చేసే నాయకులుగా మాత్రం చివరిదాకా సంకల్పబద్ధులు కాలేకపోయారు. పుట్టెడు దుఃఖం, ఆవేదనతో కన్నీరు పెట్టుకుంటున్న తెలంగాణను కేసీఆర్ అర్థం చేసుకున్నారు. తెలంగాణ విముక్తి కోసం పిడికిలి బిగించింది మొదలు పద్నాలుగేండ్లపాటు అలుపు లేని పోరాటంతో తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చారు.
ఉద్యమ నాయకునిగా తెలంగాణ ప్రజలు పడుతున్న పుట్టెడు బాధలను ఆయన కండ్లారా చూశారు. ఒక్కో ఊరిది ఒక్కో కథ. ఒక్కొక్కరిది ఒక్కో వ్యధ. ఆ గాయాలను కేసీఆర్ గమనించినంతగా మరెవరూ గమనించలేదనడానికి అనేక సాక్ష్యాలున్నాయి. తాగునీటి సమస్య మొదలు.. ప్రతి సమస్యపై స్పష్టత, పరిష్కార మార్గాలు తెలిసిన ఏకైక వ్యక్తి కేసీఆర్. ఉమ్మడి పది జిల్లాల తెలంగాణ వ్యాప్తంగా స్థానికులకు తెలువని అక్కడి పరిస్థితులను కూడా గుర్తించి పరిష్కరిస్తూ భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు.
నాడు అరిగోస వడ్డ తెలంగాణ, నేడు సస్యశ్యామలమవుతున్నది. వలసల తెలంగాణ నేడు విశ్వ వేదికలకు ఆశ్రయం ఇస్తున్నది. ఆరు దశాబ్దాలకు పైగా దోపిడికి గురైన తెలంగాణ గడ్డ దశాబ్దంలోనే ప్రపంచ వేదికల మీద ప్రగతి గౌరవాన్ని అందుకుంటున్నది. అందుకు మన ఉద్యమసారథి కేసీఆర్ సంకల్పం ఎంత దృఢమైనదో చెప్పవచ్చు. మానవీయ కోణంలో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ నేడు అన్ని వర్గాలకు పెద్దపీట వేస్తున్నారు. నాడు తెలంగాణ నేల బీళ్లు వారి బిక్కుబిక్కుమంటూ చూసింది. నేడు పచ్చదనం నింపుకొని దేశంలోనే వరి పండించడంలో అగ్రగామిగా ఎదిగింది. ఒకనాడు భూగర్భ జలాలు లేక వట్టిపోయిన బోర్లు… నేడు వందడుగుల బోరు వేస్తేనే నీరు ఉబికి వస్తున్నది. ఏ రాష్ట్రంలో లేనివిధంగా రైతుల కన్నీటి గోసను పట్టించుకున్నది కేసీఆర్ మాత్రమే. ఒకప్పుడు ఎంతోమంది రైతులు రాత్రిపూట కరెంటుకు బలయ్యారు. ఇంటి పెద్దను కోల్పోయి రోడ్డున పడ్డ కుటుంబాలెన్నో.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంక్షే మ పథకాలు అవుతున్నాయి. నాడు విజ్ఞానమైన తెలంగాణలో అక్షర దోపిడి జరిగి అనేకమంది విద్యార్థులు విద్యకు దూరమైతే.. నేడు ఇదే తెలంగాణ గడ్డ నుంచి సివిల్స్, నీట్ లాంటి జాతీయస్థాయిలో ప్రతిభ కనబరుస్తూ తెలంగాణ వెలుగులోకి వస్తున్నది. తెలంగాణ ప్రాంతంలో నాడు విద్య, ఆరోగ్యం, ఆర్థికాన్ని దెబ్బతీస్తే.. నేడు కేసీఆర్ ఆ మూడు రంగాల భద్రతకు భరోసా కల్పిస్తున్నారు. చాలీచాలని పింఛన్లను పెంచి వికలాంగులు, వృద్ధ్దులకు ఆసరా కల్పిస్తున్నారు. మహిళలకు స్థానిక సంస్థల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించి రాజకీయాల్లో వారి ప్రాధాన్యాన్ని పెంచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కుతుంది.
క్షేత్రస్థాయిలో పనిచేసే ఆశ, అంగన్వాడీలకు గతంలో చాలీచాలని ప్రోత్సాహకాలు అందజేసేవారు. దానిని కేసీఆర్ నెలనెలా వేతనాలుగా మా ర్చి అందిస్తున్నారు. దీంతో వారికి ఒక గుర్తింపు వచ్చింది. ఇటీవల వీఆర్ఏలను క్రమబద్ధీకరించడంతో తెలంగాణ సమాజాన్ని ఆలోచింపజేస్తున్నాయి. గ్రామాల్లో నీరడి, మస్కూర్ల పేర్లతో గొడ్డుచాకిరి చేస్తూ వెట్టి మీద బతికే పరిస్థితికి చరమగీతం పాడారు. వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో దాదాపు 20,555 మంది వీఆర్ఏలకు విముక్తి లభించింది. కేసీఆర్ ఇలా అనేక గొప్ప గొప్ప నిర్ణయాలతో తెలంగాణకు భవిష్యత్తు బాటను నిర్మిస్తున్నారు.
‘ఎవరూ వెయ్యి సంవత్సరాలు బతుకరు.. బతికి ఉన్నంతలో… భవిష్యత్తును నిర్మించాలి… అందుకు తెలంగాణ యావత్తు ఒక్కటిగా నిలబడి అభివృద్ధి చేసుకోవాల’ని ఆయన చెప్పిన మా టలు అందరికీ బాధ్యతను గుర్తుచేస్తున్నాయి. రాజకీయ అవకాశాలు దృష్టిలో ఉంచుకొని, ప్రజల ఆశల మీద రాజకీయాలు చేద్దామనుకునే పార్టీలు మనుగడ సాగించలేవు.
సమాజానికి అన్నివిధాలుగా అండగా ఉంటూ తెలంగాణను పునర్నిర్మిస్తున్నారు కేసీఆర్. ఆయన అడుగులో మనం నడవాల్సిన ఆ వశ్యకత ఉన్న ది.అభివృద్ధి అంటే ఎన్నికల ముందు మాట్లాడే మా టలు కాదు, ఎన్నికల తర్వాత ప్రజలకు చే సే పనులు అని ప్రతిపక్షాలు ఇకనైనా తెలుసుకోవాలి. ఇప్పుడు సీఎం కేసీఆర్ నేతృత్వం లో అన్నిరంగాల్లో తెలంగాణను ఓ అద్భుత శక్తిగా నిర్మించుకుంటు న్నాం. ఆయన చేస్తున్న కృషిలో మనమంతా సంకల్ప బాధ్యత తీసుకోవాలి.
-గడ్డం సంపత్
78933 03516