గుండె పొంగుతున్నది! ప్రాణం పరిమళిస్తున్నది!! మనసు హత్తుకుంటున్నది!!!
చిరకాల మిత్రుడిగా, కాలేజీ సహచరుడిగా, ప్రాణ స్నేహితుడిగా కేటీఆర్ను చూస్తుంటే ఈ జన్మ ధన్యమైందనిపిస్తున్నది. దీనికి కారణం ఇటీవల మంత్రి కేటీఆర్తో టీవీ 9 జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూలో జర్నలిస్ట్ రజినీకాంత్ అన్న మాటలు చర్చించుకోవాలి.
టీఆర్ఎస్ బీఆర్ఎస్గా రూపాంతరం చెం దిన క్రమాన్ని రజినీకాంత్ ప్రశ్నిస్తూ టీఆర్ఎస్కు గల అర్హతలపై మాట్లాడారు. వెంటనే కేటీఆర్ తడుముకోకుండా… ‘మీ టీవీ-9 తెలుగులో మొదలై దేశమంతటా విస్తరించింది. ఇప్పు డు దేశంలోని పలు భాషల్లో ప్రసారమవుతున్నది. అలాంటిది దేశానికి దిక్సూచి వంటి తెలంగాణ అభివృద్ధి నమూనాను దేశవ్యాప్తం చేయడానికి మేం నడుంబిగిస్తే తప్పేమిటి?’ అని ఇచ్చిన జవాబుకు రజినీకాంత్ ఒకింత వెనక్కి తగ్గి.. పంచ్ అదిరిపోయిందన్నారు. ఈ సన్నివేశం విరాట్ కోహ్లీ బ్యాటిం గ్ను తలపించిందంటే అతిశయోక్తి కాదు. కేటీఆర్ అప్పటికప్పుడు సమయస్ఫూర్తితో సమాధానం చెప్పిన తీరు అమోఘం! అనిర్వచనీయం!! నాయకుడంటే ఇలాగే ఉండాలి. బట్టీ కొట్టి వచ్చిన విద్యార్థిలా కాకుండా సమయం, సందర్భాన్ని బట్టి ఔచిత్యం ప్రదర్శించాలి. అప్పుడే ఆ నాయకుడికి ప్రజామోదం మరింత పెరుగుతుంది. ఈ ఇంట ర్వ్యూ చూసిన వారికి కేటీఆర్కు భాషపై ఉన్న పట్టు ఎటువంటిదో కూడా అర్థమవుతుంది.
ఇక్కడ కేటీఆర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ను కూడా గుర్తు చేసుకోవాలి. మునుగోడు అభ్యర్థుల్లో ఒకరు మీతో మాట్లాడుతారని రజినీకాంత్ అనగానే, ‘కేఏ పాల్ గారా?’ అని కేటీఆర్ ప్రశ్నించటంతో ఇంట ర్వ్యూ చూస్తున్న టీవీ ప్రేక్షకులు ఒక్కసారిగా హాయిగా నవ్వుకున్నారు. ఇంకా మాట్లాడుతూ.. కే ఏ పాల్, ఆర్జీ పాల్ (బీజేపీ అభ్యర్థి రాజగోపా ల్రెడ్డి).. ఎవరొచ్చినా తగ్గేదే లేదనే మాటలు హాస్యాన్ని కలిగించినప్పటికీ, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు భరోసానూ కల్పించే విధంగా ఉన్నాయి. ఉత్తమ నాయకుడి లక్షణాల్లో ఒకటైన దూరదృష్టిని కేటీఆర్లో మనం గమనించవచ్చు. బీఆర్ఎస్ భవిష్యత్తుపై రజినీకాంత్ అడిగిన ప్రశ్నకు.. కేవలం 2 సీట్లతో మొదలుపెట్టి, నేడు 303 సీట్లకు పెరిగిన బీజేపీ ప్రస్థానాన్నే కేటీఆర్ ఉదాహరణగా చూపెట్టిన తీరు గొప్పది. ‘ముఖ్యమంత్రి కేసీఆర్ చాణక్యంలో బీఆర్ఎస్ ముందుకుపోవడం పక్కా’ అని చెప్తూనే భవిష్యత్ నాయకత్వానికి తాను సిద్ధమంటూ పరోక్ష సంకేతాలిచ్చారు. ఇది ఆయన ‘క్లారిటీ ఆఫ్ థాట్’కు నిదర్శనం.
మోదీ హయాంలో ఉన్న అదే బీజేపీని తీవ్రంగా దుయ్యబడుతూ ‘మోదీ పాలనలో భారత్ అత్యధి క సంఖ్యలో పేదలున్న దేశంగా రికార్డులకెక్కడం ఆయన అసమర్థ పాలనకు నిదర్శనం’ అని తేల్చిచెప్పారు. ఇంటర్వ్యూ చివరలో రజినీకాంత్.. ‘మాటల వేడి-విమర్శల జడివాన కేటీఆర్ మాట ల్లో ఏమాత్రం తగ్గలేదు’ అని చెప్పటం కేటీఆర్ వాగ్దాటికి, సమయస్ఫూర్తికి, విషయ పరిజ్ఞానానికి లభించిన ప్రశంసగా చూడవచ్చు. ఇంటర్వ్యూ చూసిన వారెవరికైనా కేటీఆర్ భవిష్యత్తులో దేశ నాయకుడిగా ఎదగడం పక్కా అనిపిస్తుంది.
వి. యం.ప్రభు: 94403 96204