మహబూబునగర్ జిల్లాలో మగతల ప్రాంతమున్నది. దీనినే నేడు మక్తల్ అని పిలుస్తున్నారు. ఇక్కడ మల్లినాథదేవుని ఆలయం ఉన్నది. ఆ ఆలయంలో ఉన్న దైవానికి ఆ నగర అధిపతులు, ఇతర అధికారులు కలిసి అనేక గ్రామాల్లో ఉన్న మెట్ట, పల్లపు భూములను దానం చేసి శాసనం వేయించారు. ఆ శాసనం ఎవరి కాలంలో వేయించబడిందో పేర్కొనలేదు. కాని చాలా విశేషమైన శాసనంగా చరిత్రకారులు చెప్తారు.
మగతల నగరం ప్రవేశించడానికి మగతల చుట్టు ప్రక్కల గ్రామాల్లో ఉన్న శ్రీ స్వ యంభూ మల్లినాథ దేవుని కొరకు, అంగభోగ, రంగ భోగ, సమస్త భోగాల కొరకు ఆయా ప్రాంతాల్లో ఉ న్న భూములు దానంగా సమర్పించారు. పూర్వం కృ ష్ణానది ఉత్తర తీరంలో బొబ్పినాయనిపల్లి ప్రసిద్ధ నాలుగు సీమలతో కూడిన పల్లె. మగతల ఉల్లి సముద్రానికి పశ్చిమభాగంలో 8 నివర్తనాల శాలిక్షేత్రం (వరి పండే భూమి), మంత్రకూట అగ్రహార మార్గంలో ఉన్న అశ్వత్థ తటానికి ఆగ్నేయదిశలో వింశతి (20) నివర్తనాల నల్లరేగడి భూమి, జక్కిలేరు మార్గంలో కాటని చెలమ తేకులపల్లి తటాకం మధ్యలో 30 నివర్తనాల నల్లరేగడి భూమి (కృష్ణక్షేత్రం), ఊటుకూర మార్గంలో 10 నివర్తనాల నల్లరేగ డి భూమి, వెన్న సముద్రం పశ్చి మ భాగంలో 15 నివర్తనాల న ల్లరేగడి భూమి, నల్లజేని సమీపంలో ఉత్తరభాగంలోని పాం డుర క్షేత్రంలో 30 నివర్తనాల భూమి, వేమరి కాచ సముద్రం లో రెండు నివర్తనాల శాలిక్షేత్రం బ్రమ్మిరెడ్డి తటాకంలో ఒక నివర్తనం శాలిక్షేత్రం, అనుపూ ర గ్రామం లో 4 నివర్తనాల నల్లరేగడి భూమి…. ఇలా మగతల నగరంలో చాలామంది సమర్పించారు.
ఇంకా వర్తకులు స్వామివారికి తమ అమ్మకాల లో కొంత ధనాన్ని సమర్పించాలి. వక్కలు అమ్మినవారు ఐదవ వంతు, తమలపాకులు ఒక భారానికి నూరు ప్రకారంగా, వైశ్యులు ఒక్కో ఇంటివారు రో జుకు గరిటెడు బియ్యం, గాండ్లవారు 8వ వంతు నూనెను, కొబ్బరికాయలు బండికి 5 చొప్పున, కూర లు పిడికెడు, ఉసిరికాయలు బండికి ప్రస్థ (కుంచెడు) ధాన్యాదులు ప్రతి బండికి ప్రస్థ, పువ్వుల కోసం ఒక తోట, శాకముల కోసం (కూరగాయలు) ఒక తోటను సమర్పించారు. అదేవిధంగా ఉజ్జయని దండనాయ క తటాకంలో కూరల కొరకు ఒక నివర్త నం భూమి, బాడాల సంగసముద్రంలో శాలిక్షేత్రం 8 నివర్తనములు సమర్పించారు.
స్వామివారికి సమర్పించే భూమితో పాటు తమ వ్యాపారంలో వచ్చిన లాభాలను కూ డా కొంత స్వామికి సమర్పించ డం వల్ల ధార్మిక కార్యక్రమాలతో పాటు, తమ వ్యాపారం కూడా బాగుండాలనే దృష్టి ఇందులో గమనించవచ్చు.
– భిన్నూరి మనోహరి
area is located in . This is called today.