పల్లవి: తెలంగాణ ప్రగతి రథం వాడకొచ్చెనూ-
దళిత వాడకొచ్చెనూ
అణగారిన బతుకులకూ బలమునిచ్చెనూ-
ఆత్మబలమునిచ్చెనూ
అనుపల్లవి: దళితబంధు పథకంతో ధనమునిచ్చెనూ-
మూల ధనమునిచ్చెనూ
దారిద్య్రం అంతమయ్యె భాగ్యమిచ్చెనూ-
మహాభాగ్యమిచ్చెనూ
జై జై బోలో దళితబంధుకూ – జై జై బోలో కేసీయారుకూ
జై జై బోలో దళితబంధుకూ – జై జై బోలో ఆత్మబంధుకూ
॥తెలం॥
చరణం 1: రెక్కాడితే డొక్కాడని బక్క పేదలా
దున్నేందుకు భూమి లేని దుఃఖజీవులా
సొంత ఆస్తులెరుగనీ బీదబిడ్డలా
చెరలు బాపి వరములిచ్చే చేయిదొరికెనూ
చితికిపోయిన జీవితాలు చివురులెత్తగా
వాడిపొయినవాడలా వసంతమొచ్చెనూ
దళిత వసంతమొచ్చెనూ
జై జై బోలో దళితబంధుకూ- జై జై బోలో కేసీయారుకూ
జై జై బోలో దళితబంధుకూ- జై జై బోలో ఆత్మబంధుకూ
॥తెలం॥
చరణం 2: తరతరాల తండ్లాటల కూలబడిన దళితజాతి
తమకు తాముగా ఎదిగే తరుణం వచ్చిందీ
మమతగల్ల కేసీఆరు మనసులోంచి పుట్టిన
సాధికారతా పథకం సాయమందనున్నదీ
మాలమాదిగన్నలే యజమానులుగా
పలురకాల ఉపాధులతో పచ్చగ వర్ధిల్లాలి
జై జై బోలో దళితబంధుకూ- జై జై బోలో కేసీయారుకూ
జై జై బోలో దళితబంధుకూ- జై జై బోలో ఆత్మబంధుకూ
॥తెలం॥
– డి.బాలార్క