తెలంగాణలో కమలం ‘బండి’కి ఎన్ని జాకీలు పెట్టినా లేచే పరిస్థితి కనిపించకపోవడంతో ఇప్పుడా పార్టీ నేతలు మరో కొత్త ఆలోచనలో పడ్డారు. పాదయాత్రలు, లైవ్ దీక్షల వల్ల ఫలితం లేదని, సినిమా ద్వారా ట్రై చేసి చూద్దామని ప్లాన్ చేస్తున్నారు. ‘కశ్మీర్ ఫైల్స్’ తరహాలో ‘భాగ్యనగర్ ఫైల్స్’ అనే సినిమా తీసే పనిలో పడినట్టు ఆ పార్టీ మధ్యప్రదేశ్ ఇంచార్జీ మురళీధర్రావు ప్రకటించారు. సినిమా తీసిన వారి కంటే, విమర్శకుల పరోక్ష పబ్లిసిటీతో కశ్మీర్ ఫైల్స్ సూపర్హిట్ అయినట్లుగా తన భాగ్యనగర్ ఫైల్స్ కూడా హిట్ కొట్టే అవకాశం ఉందని ఆయన అంచనా వేస్తున్నారు. దీనివల్ల ఒకే దెబ్బకు రెండు పిట్టలు రాలినట్టు వర్అవుట్ అవుతుందని ఆయన గట్టి ధీమాగా ఉన్నారు. ఎనిమిదేండ్లుగా నామినేటెడ్ పోస్టు కోసం ఎంత ప్రయత్నించినా దకకపోవడంతో ఈసారి సినిమా ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటున్నారు. హిందూయిజం ట్యాగ్లైన్తో సినిమా తీస్తే.. అటు మోదీ, షాల దృష్టిలో పడటంతోపాటు, ఇటు నెగెటివ్ పబ్లిసిటీతో సినిమాకు కాసుల వర్షం కురిసే అవకాశం లేకపోలేదని ఆశిస్తున్నారు.