తమ ‘ఉదయ్పూర్ చింతన్ శివిర్’కు ఏర్పాటు చేసిన మైక్ సరిగానే పని చేసిందా? లేదా? అని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆరా తీస్తున్నది. ఎందుకంటే అకడ ఇచ్చిన ‘భారత్ జోడో’ పిలుపు కొందరికి ‘పార్టీ చోడో’గా వినిపించిందా? అనే అనుమానం వ్యక్తమవుతున్నది. ఎందుకంటే, ఒకవైపు చింతన్ బైఠక్ జరుగుతుండగానే మరోవైపు గుజరాత్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్దిక్ పటేల్, పంజాబ్ ముఖ్యనేత సునీల్ జాఖఢ్ పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. అందుకే వీరికేమైనా ‘జోడో’కు బదులు ‘చోడో’ అని వినిపించిందా? అని ఆరా తీస్తున్నారు. కనీసం రాహుల్ గాంధీకైనా సరిగ్గా వినిపించిందా? లేదా? అని మరికొందరు అనుమానం వ్యక్తం చేసున్నారు. ఈయనకు ‘భారత్ చోడో’గా వినిపించిందా ఏమిటి కొంపదీసి అని అనుమానపడుతున్నారు. చింతన్ శివిర్ నుంచి ఆయన నేరుగా విదేశాలకు చెకేశారు. ఒక కుటుంబం-ఒక టికెట్ తీర్మానంతో ఎట్లాగూ తనకు కాకుండా ప్రియాంకకు టికెట్ వస్తుందన్న అంచనాతో రాహుల్ ‘భారత్ చోడో’ ఫాలో అయినట్టున్నారు.