న్యూపూణేలోని తెలుగు భాషా వికాస పరిషత్ వార్షికోత్సవం సందర్భంగా కథల పోటీ నిర్వహిస్తున్నారు. ఈ పోటీ నిమిత్తం సామాజిక స్పృహ కలిగిన కథలను ఆహ్వానిస్తున్నారు. కథల్లో ఆధునికత,కొసమెరుపు ఉండాలి. హృదయాలను ఆకర్షింపజేయాలి. కథలు డీటీపీలో 4 పేజీలు మించరాదు. వస్తువు మీ ఇష్టం. హామీపత్రం తప్పనిసరి.
ప్రథమ బహుమతి: రూ.60వేలు, ద్వితీయ బహు మతి: రూ.40వేలు, తృతీయ బహుమతి : రూ.20 వే లు. కథలు mvsmurthypolice @gmail.com ఈ మెయిల్కు ఏప్రిల్ 30 లోపు పంపాలి.
-ఎంవీఎస్ మూర్తి
కీర్తిశేషులు డాక్టర్ చింతోజు బ్రహ్మయ్య, బాలమణి మెమోరియల్ ఎడ్యుకేషనల్ అం డ్ చారిటబుల్ ట్రస్టు వారు 2010 ఏడాది నుంచి వివిధ విభాగాల్లో బడి పిల్లల రచనల కు పురస్కారాలు అందిస్తున్నారు. 2020, 2021, 2022 సం.లకు గాను పురస్కారానికి ఎంపికైన వారి జాబితాను విడుదల చేశా రు. విజేతలకు నగదు, మెమొంటో, సర్టిఫికెట్, శాలువాలతో సత్కరించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పురస్కార ప్రదానోత్సవ తేదీని త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు.
– గరిపెల్లి అశోక్, కన్వీనర్
స్పందన అయాచితం రచించిన ‘బంగారు పిచ్చుక కథ ’ నవల పరిచయ కార్యక్రమం 2023 మార్చి 27న సాయంత్రం జూమ్ వేదికద్వారా జరుగుతుంది. తెలంగాణ రచయితల సంఘం జంటనగరాల అధ్యక్షులు కందుకూరిశ్రీరాములు సభాధ్యక్షులుగా జరిగే సభలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు డా. అయాచితం ,డా. సంపత్ కుమార్, డా.కొండపల్లి నీహారిణి, డా.రూప్ కుమార్ డబ్బీకార్, డా. కొండవీటి నాగవాణి తదితరులు పాల్గొంటారు. -తెరసం, జంటనగరాలు