ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటుపరం చేయటానికి మోదీ సర్కార్ వేస్తున్న అడుగులు లక్షలాదిమంది బ్యాంకు ఉద్యోగులకే కాదు, కోట్లాది మంది ఖాతాదారులకు, దేశప్రజానీకానికి ఆందోళన కలిగిస్తున్నాయి. దేశ ఆర్థికరంగానికి ఆయువుపట్టయిన బ్యాంకింగ్ వ్యవస్థను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడం దేశానికి ఏ విధంగా శ్రేయస్కరమో కేంద్రమే చెప్పాలి. లాభార్జనే ధ్యేయంగా పని చేసే ప్రైవేటు బ్యాంకులు.. రైతుల, పేదల సంక్షేమాన్ని ఎందుకు పట్టించుకుంటాయి? 1969లో ఇందిరాగాంధీ హయాంలో బ్యాంకుల జాతీయీకరణ జరిగింది. నాడు బ్యాంకులు తమ సేవలను పరిశ్రమల అధిపతులకు, బడా వ్యాపారులకు మాత్రమే అందజేస్తుండేవి. రైతులు, బలహీనవర్గాలు, మహిళల వంటి వారికి బ్యాంకుసేవలు అందనంత దూరంలో ఉండేవి. ఈ పరిస్థితిని మార్చటానికి బ్యాంకుల జాతీయకరణను చేపట్టవలసి వచ్చింది.
బ్యాంకుల జాతీయకరణ దేశ ఆర్థికవ్యవస్థకు బలమైన పునాదిగా మారిందని ఈ 52 ఏండ్ల చరిత్ర స్పష్టం చేస్తున్నది. బస్సులు కూడా లేని మారుమూల గ్రామాలకూ బ్యాంకుల శాఖలు విస్తరించాయి. రైతులకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, చేతివృత్తుల వారికి, మహిళల స్వయం సహాయక గ్రూపులకు రుణాలను అందజేశాయి. తమ కష్టార్జితాన్ని దాచుకోవటానికి భరోసా కల్పించాయి. కోట్లాదిమంది ప్రజలను బ్యాంకు సేవల పరిధిలోకి తీసుకొచ్చిన ఆర్థిక విప్లవం ఇది. దేశంలో ఆర్థిక సంస్కరణల తర్వాత ప్రైవేటు బ్యాంకులు కూడా ప్రవేశించినప్పటికీ, వాటికి దీటుగా ప్రభుత్వ బ్యాంకులు సేవల్ని అందిస్తున్నాయి. అందుకే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బ్యాంక్ బచావో.. దేశ్ బచావో అనే నినాదం ముందుకొచ్చింది.
ప్రభుత్వరంగ బ్యాంకులలో లక్షల కోట్ల రూపాయల మేర మొండి బకాయిలు ఉన్న మాట నిజం. కానీ ఇందుకు అవి పేదలకు సేవలు అందించడం, సామాజిక బాధ్యతను నిర్వర్తించడం కారణం కాదు. బడా పారిశ్రామికవేత్తల మోసాలు, అందుకు రాజకీయ నాయకుల మద్దతు బ్యాంకుల నిరర్థక ఆస్తులకు కారణం. రాజకీయ నాయకత్వం చిత్తశుద్ధితో చక్కదిద్దితే ప్రభుత్వరంగ బ్యాంకులు మరింతగా దేశ ఆర్థిక పురోగమనానికి, సామాజిక పరివర్తనకు దోహదపడగలవు. 1935లో ఆర్బీఐ ఏర్పడినప్పటి నుండి 1969 వరకూ దేశంలో అక్షరాలా 1,565 ప్రైవేటు బ్యాంకులు మూతబడ్డాయి. వాటిలో పొదుపు చేసుకున్న వాళ్లు సర్వం కోల్పోయారు. ఇటీవలి కాలంలోనూ ప్రైవేటు బ్యాంకులు మూతపడిన ఉదంతాలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటుపరం చేయడం సమాజానికి శ్రేయస్కరం కాదు. బ్యాంకింగ్ మొదలుకొని ప్రతి రంగాన్ని చక్కదిద్దడానికి ప్రైవేటీకరణే పరమౌషధమనే ఆలోచనను విడనాడాలి.
ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటుపరం చేయటానికి మోదీ సర్కార్ వేస్తున్న అడుగులు లక్షలాదిమంది బ్యాంకు ఉద్యోగులకే కాదు, కోట్లాది మంది ఖాతాదారులకు, దేశప్రజానీకానికి ఆందోళన కలిగిస్తున్నాయి. దేశ ఆర్థికరంగానికి ఆయువుపట్టయిన బ్యాంకింగ్ వ్యవస్థను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడం దేశానికి ఏ విధంగా శ్రేయస్కరమో కేంద్రమే చెప్పాలి. లాభార్జనే ధ్యేయంగా పని చేసే ప్రైవేటు బ్యాంకులు.. రైతుల, పేదల సంక్షేమాన్ని ఎందుకు పట్టించుకుంటాయి? 1969లో ఇందిరాగాంధీ హయాంలో బ్యాంకుల జాతీయీకరణ జరిగింది. నాడు బ్యాంకులు తమ సేవలను పరిశ్రమల అధిపతులకు, బడా వ్యాపారులకు మాత్రమే అందజేస్తుండేవి. రైతులు, బలహీనవర్గాలు, మహిళల వంటి వారికి బ్యాంకుసేవలు అందనంత దూరంలో ఉండేవి. ఈ పరిస్థితిని మార్చటానికి బ్యాంకుల జాతీయకరణను చేపట్టవలసి వచ్చింది.
బ్యాంకుల జాతీయకరణ దేశ ఆర్థికవ్యవస్థకు బలమైన పునాదిగా మారిందని ఈ 52 ఏండ్ల చరిత్ర స్పష్టం చేస్తున్నది. బస్సులు కూడా లేని మారుమూల గ్రామాలకూ బ్యాంకుల శాఖలు విస్తరించాయి. రైతులకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, చేతివృత్తుల వారికి, మహిళల స్వయం సహాయక గ్రూపులకు రుణాలను అందజేశాయి. తమ కష్టార్జితాన్ని దాచుకోవటానికి భరోసా కల్పించాయి. కోట్లాదిమంది ప్రజలను బ్యాంకు సేవల పరిధిలోకి తీసుకొచ్చిన ఆర్థిక విప్లవం ఇది. దేశంలో ఆర్థిక సంస్కరణల తర్వాత ప్రైవేటు బ్యాంకులు కూడా ప్రవేశించినప్పటికీ, వాటికి దీటుగా ప్రభుత్వ బ్యాంకులు సేవల్ని అందిస్తున్నాయి. అందుకే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బ్యాంక్ బచావో.. దేశ్ బచావో అనే నినాదం ముందుకొచ్చింది.
ప్రభుత్వరంగ బ్యాంకులలో లక్షల కోట్ల రూపాయల మేర మొండి బకాయిలు ఉన్న మాట నిజం. కానీ ఇందుకు అవి పేదలకు సేవలు అందించడం, సామాజిక బాధ్యతను నిర్వర్తించడం కారణం కాదు. బడా పారిశ్రామికవేత్తల మోసాలు, అందుకు రాజకీయ నాయకుల మద్దతు బ్యాంకుల నిరర్థక ఆస్తులకు కారణం. రాజకీయ నాయకత్వం చిత్తశుద్ధితో చక్కదిద్దితే ప్రభుత్వరంగ బ్యాంకులు మరింతగా దేశ ఆర్థిక పురోగమనానికి, సామాజిక పరివర్తనకు దోహదపడగలవు. 1935లో ఆర్బీఐ ఏర్పడినప్పటి నుండి 1969 వరకూ దేశంలో అక్షరాలా 1,565 ప్రైవేటు బ్యాంకులు మూతబడ్డాయి. వాటిలో పొదుపు చేసుకున్న వాళ్లు సర్వం కోల్పోయారు. ఇటీవలి కాలంలోనూ ప్రైవేటు బ్యాంకులు మూతపడిన ఉదంతాలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటుపరం చేయడం సమాజానికి శ్రేయస్కరం కాదు. బ్యాంకింగ్ మొదలుకొని ప్రతి రంగాన్ని చక్కదిద్దడానికి ప్రైవేటీకరణే పరమౌషధమనే ఆలోచనను విడనాడాలి.