వ్యవసాయ యూనివర్సిటీ జూలై 9: వ్యవసాయంలోనూ ఆధునిక టెక్నాలజీ ఎంతో అవసరమని, ప్రైవేటు సంస్థలు సైతం ముందుకు రావడం అభినందనీయమని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ ప్రవీణ్ రావు అన్నారు. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ, రైతు మంత్రిత్వ సంక్షేమ శాఖకు చెందిన నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. పరిపాలన భవనంలో జరిగిన కార్యక్రమంలో ఉప కులపతి డా. ప్రవీణ్ రావు సమక్షంలో రిజిస్ట్రార్ డా. సుధీర్ కుమార్, ఆయా సంస్థల యాజమాన్యం ఒప్పంద పత్రాలపై సంతకం చేశారు.
ఈ సందర్భంగా ప్రవీణ్రావు మాట్లాడుతూ.. శిక్షణ, పరిశోధనా అంశాలు, ఫార్మ్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ శిక్షణ ఇస్తామని ఎన్డీసీ పేర్కొందన్నారు. యూజీసీ విద్యార్థులకు ఇంటర్న్షిప్ అవకాశాలను కల్పిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, పీజేటీఎస్ఏయూల మధ్య ఒప్పందం కుదిరిందన్నారు. యారా ఫెర్టిలైజర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, టెక్ మహీంద్ర ప్రైవేట్ లిమిటెడ్, వర్చువల్ విధానంలో జరిగిన ఒప్పందం నిమ్స్ మే డైరెక్టర్ జనరల్ డా. గ్లోరీ, కన్వీనర్ సంజీవ్, యారా ఫెర్టిలైజర్స్, ఎన్సీడీసీ, సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఈ ప్రాంతానికి సాగునీరు రావడంతో గణనీయంగా సాగు దిగుబడి పెరిగిందని సూచించారు. ఆయా సంస్థలు తెలంగాణలో మంచి ఫలితాలు వస్తాయనే ముందు చూపుతోనే ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయన్నారు. రిజిస్ట్రార్ డా. సుధీర్ కుమార్ అవగాహన ఒప్పందం పై సంతకాలు చేశారు. కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ జగదీశ్వర్, ప్రతిష్ట ఇండస్ట్రీస్ ప్రతినిధులు, వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.