నిర్మల్ : జిల్లాలోని సోన్ మండల వైస్ ఎంపీపీ కొత్తగొల్ల నరేశ్ యాదవ్(34) సోమవారం కరోనాతో మృతి చెందాడు. వారం క్రితం లక్షణాలు ఉండటంతో సోన్ పీహెచ్సీలో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్గా నిర్ధారణ అయింది. వెంటనే రెండు రోజుల పాటు ఇంట్లో ఉన్నారు. లక్షణాలు ఎక్కువకావడంతో నిర్మల్లోని ప్రైవేట్ దవాఖానలో చేరారు.
వైద్యుల సూచన మేరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ దవాఖానకు వెళ్లారు. నాలుగు రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించి సోమవారం ఉదయం మృతి చెందారు. నరేశ్ యాదవ్కు భార్య, కొడుకు, బిడ్డ ఉన్నారు.