మాదాపూర్ : కొండాపూర్లోని 8 వ బెటాలియన్లో స్వర్గీయ వీరబాబు సంస్మరణ సభను గురువారం కమాండెంట్ మురళీకృష్ణ ఆధ్వర్యంలో బెటాలియన్ సిబ్బందితో కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ … పోలీసు బెటాలియన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తు వీరబాబు అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.
ఉద్యోగరీత్యా ప్రభుత్వం నుండి రావలసిన అన్ని రకాల బెనిఫిట్లను వారి కుటుంబానికి అందించేందుకు కృషి చేస్తామని వీరబాబు తల్లిదండ్రులకు తెలిపారు. వీరబాబు మృతి చెందిన అనంతరం ఆయన అవయవాలను దానం చేయడం అభినందనీయమని కొనియాడారు.
ఇందులో భాగంగా 8వ బెటాలియన్ పోలీసు సిబ్బంది విరాళాలుగా సేకరించిన మొత్తం రూ. 5.60 లక్షలను ఆయన తల్లిదండ్రులకు కమాండెంట్ మురళీ కృష్ణ చేతుల మీదుగా అందజేశారు.