పహాడీషరీఫ్ : ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ వ్యక్తి అదృశ్యమైన ఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై శోభ వివరాల ప్రకారం పోలీస్ స్టేషన్ పరిధిలోని వాది ఏ ముస్తఫా కాలనీలో నివాసముంటున్న షేక్ రహీం (38) పండ్ల వ్యాపారం చేస్తుంటాడు.
ప్రతి రోజు ఉదయం 10 గంటలకు వెళ్లి తిరిగి సాయంత్రం ఐదు గంటలకు వస్తుంటాడు. 10న ఉదయం వెళ్లిన అతను సాయంత్రం 7 గంటల వరకు రాకపోయే సరికి భార్య ముంతాజ్ బేగం భర్తకు ఫోన్ చేసింది. స్వీచ్ఛాప్ వచ్చింది. అతని కోసం పలు చోట్ల వెతికినా ఆచూకి లభించలేదు.
దీంతో ఆమె గురువారం పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.