అంబర్పేట : హిమాయత్నగర్ మండల పరిధిలో ఉన్న మూసీ నది సరిహద్దులు ఏర్పాటు నిర్ణయానికి సంబంధించి బఫర్జోన్లోని ప్రభుత్వ పట్టా భూములపై అభ్యంతరాలను తెలియజేయాలని తహశీల్దార్ సి.హెచ్.లలిత తెలిపారు.
ఈ నెల 24న దీనికి సంబంధించి హైదరాబాద్ ఆర్డీవో వెంకటేశ్శర్లు నోటిఫికేషన్ జారీ చేశారని చెప్పారు. నోటిఫికేషన్ పత్రాలను మండల కార్యాలయం నోటీసు బోర్డుపై, సంబంధిత పోలీస్స్టేషన్, జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయాల నోటీసు బోర్డులపై అతికించడం జరిగిందన్నారు.
ప్రకటన వెలువడిన తేదీ నుంచి 15 రోజులలోపు అభ్యంతరాలను హిమాయత్నగర్ తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్లకు రాతపూర్వకంగా దాఖలు చేయాలని పేర్కొన్నారు.