కాచిగూడ : అంబర్పేట నియెజకవర్గంలోని పలు డివిజన్లో నెలకొన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తానని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడానికి బుధవారం ఆయన గోల్నాక డివిజన్లోని దుర్గాసింగ్లైన్, నింబోలిఅడ్డా తదితర ప్రాంతాల్లో పర్యటించారు.
ఈ సందర్భంగా తన దృష్టికి వచ్చిన నీటి, డ్రైనేజీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని జలమండలి అధికారులను ఆదేశించారు. పలు బస్తీలలో ఏండ్లనాటి తుప్పుపట్టిన పైపులైన్ల ద్వారా కలుషిత నీళ్లు వస్తున్నాయని, దీంతో ఇబ్బందు లు పడుతున్నామని స్థానికులు ఎమ్మెల్యే కాలేరుకు ఫిర్యాదు చేయగా స్పందించిన ఎమ్మెల్యే పాత పైపులైన్ల స్థానంలో నూతన పైపులను వేయాలని జలమండలి అధికారులను అదేశించారు.
అదే విధంగా బస్తీ ప్రజల కోసం సీసీ రోడ్డు వేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. అనంత రం ఎమ్మెల్యే కాలేరు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల కనీస అవసరాలైన మౌలిక వసతుల కల్పనలో రాజీపడే ప్రసక్తే లేదని, డివిజన్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి ప్రణాళికా బద్దంగా అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో గోల్నాక అధ్యక్షుడు కొమ్ము శ్రీను, జలమండలి డీజీఎం సన్యాసిరావు,ఏఈ భావన, డీఈ సుధాకర్, శైలేశ్ కుమార్, జ్యోతి, దేవి, శశిరేఖ, శ్రీకాంత్, శివరాజ్, మనోహర్లాల్, రోహిత్, పట్లూరి సతీశ్, సంతోశ్ పాల్గొన్నారు.