పాలమూరు
కేంద్రాలు : 181
అంచనా : 3.50 లక్షల
మెట్రిక్ టన్నులు
సేకరించింది : 1,05,228.070
మెట్రిక్ టన్నులు
నాగర్కర్నూల్
కేంద్రాలు : 222
అంచనా : 3.12 లక్షల
మెట్రిక్ టన్నులు
సేకరించింది : 31,792
మెట్రిక్ టన్నులు
గద్వాల
కేంద్రాలు : 53
అంచనా : 1.90 లక్షల
మెట్రిక్ టన్నులు
సేకరించింది :
15,037.92
మెట్రిక్ టన్నులు
నారాయణపేట
కేంద్రాలు : 104
అంచనా : 2.49 లక్షల
మెట్రిక్ టన్నులు
సేకరించింది : 60,803
మెట్రిక్ టన్నులు
మహబూబ్నగర్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అన్నదాతకు అండగా ఉండేందుకు తెలంగాణ సర్కార్ ఎల్లవేళలా కృషి చేస్తున్నది. కరో నా కాలంలోనూ రైతుల కళ్లాల వద్దకే వెళ్లి ధాన్యం కొనుగోలు చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ బాధ్యతను మరోసారి విజయవంతంగా నెరవేరుస్తున్నది. రైతుల కు మద్దతు ధర అందిస్తున్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తం గా 800కు పైగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరిస్తున్నారు. రైతులకు చెల్లింపులు సైతం ఎప్పటికప్పుడు చేస్తున్నారు. మరోవైపు సన్నరకాలకు బహిరంగ మార్కెట్లోనూ గిట్టుబాటు ధర వస్తుండడంతో కొందరు అన్నదాతలు నేరుగా మిల్లర్లకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 80 శాతానికి పైగా కొనుగోళ్లు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. నెల రోజులపాటు కేంద్రాలు తెరిచే ఉంచుతామని చెబుతున్నారు. కొనుగోలు పూర్తయిన చోట కేంద్రాలు మూసేస్తున్నట్లు పేర్కొంటున్నారు.
భారీగా పెరిగిన సాగు..
ప్రస్తుత వానకాలంలో వరి సాధారణ విస్తీర్ణానికి మించి సాగైంది. వరి సాధారణ సాగు విస్తీర్ణం ఉమ్మడి జిల్లాలో సుమారు 4.50 లక్షల ఎకరాలు కాగా.. నీటి లభ్యత గణనీయంగా పెరగడంతో ఈసారి ఏకంగా 7 లక్షల ఎకరాలకు పైగా సాగు చేశారు. 18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రానున్నట్లు అధికారుల అంచనా. ఇందులో రైతులు తమ సొంత అవసరాలు, విత్తనం కోసం తీసిపెట్టుకోగా.. మార్కెట్లో విక్రయానికి సుమారు 16.72 లక్షల మెట్రిక్ టన్నులు వస్తుందని అంచనా వేశారు. ఇందుకు గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు, తూకం కొలిచే యంత్రాలు, తేమ కొలిచే మెషీన్లు మొదలైన వాటన్నింటిని సమకూర్చి కొనుగోలు ప్రక్రియ వేగంగా సాగేలా జాగ్రత్తలు తీసుకున్నారు. యాసంగిలో వరికి మద్దతు ధర రూ.1880 నిర్ణయించిన ప్రభుత్వం.. ఈసారి గ్రేడ్ ఏ రకానికి రూ.1,960, గ్రేడ్ బీ రకానికి రూ.1940 నిర్ణయించింది. గ్రేడ్ ఏ రకానికి యాసంగితో పోలిస్తే రూ.80 పెంచి రైతుకు ప్రయోజనం చేకూర్చింది. నిబంధనల మేరకు ధాన్యం తీసుకొచ్చిన రైతన్నలకు గ్రేడ్ ఏ ధర లభించిందని అధికారులు తెలిపారు.
జిల్లాలో 187 కొనుగోలు కేంద్రాలకుగానూ ప్రస్తుతం 181 కేంద్రాలు తెరుచుకొని ఉన్నాయి. ధాన్యం సేకరణ 3.50 లక్షల మెట్రిక్ టన్నులు అంచనా ఉండగా.. ఇప్పటివరకు సన్నరకం 60,757.070, దొడ్డురకం 44,471 మెట్రిక్ టన్నులు కలిపి.. మొత్తం 1,05,228.070 మెట్రిక్ టన్నులు సేకరించారు. ఇందులో మిల్లులకు 1,03,322.860 మెట్రిక్ టన్నులు తరలించారు. 22,165 మంది రైతుల నుంచి సేకరించిన ధాన్యం విలువ రూ. 206.24 కోట్లు కాగా.. రూ.119.93 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశారు.
వనపర్తిలో 40 శాతం పూర్తి..
వనపర్తి, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : వానకాలంలో సాగు చేసిన ధాన్యం కొనుగోలును రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా చేపడుతున్నది. టోకెన్ విధానంలో కొనుగోలు కేంద్రాల వద్ద ధా న్యాన్ని సేకరిస్తున్నది. డబ్బును కూడా నేరుగా రైతు ఖాతాల్లో జమ చేస్తున్నది. జిల్లాలో ఈ ఏడాది వా నకాలంలో 72 వేల ఎకరాల్లో వరి సాగు చేయగా.. మూడున్నర లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారుల అంచనా. ఈ మేర కు 14 మండలాల్లో 239 కొనుగోలు కేంద్రాలు ఏ ర్పాటు చేశారు. ఇప్పటివరకు 14,291 మంది రై తుల నుంచి 1.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. నలభై శాతం కొనుగోళ్లు పూర్తి చేసినట్లు వనపర్తి ఇన్చార్జి డీసీఎస్వో అనిల్కుమా ర్ తెలిపారు. పంట కోతలు లేటుగా ప్రారంభం కా వడంతో అన్ని కేంద్రాల్లో కొనుగోళ్లు జరుగుతున్నాయన్నారు. చివరి గింజ వరకు కొంటామని, రైతు లు ఆందోళన పడాల్సిందేమీ లేదన్నారు.
జోరుగా ధాన్యం కొనుగోళ్లు
గద్వాల, డిసెంబర్ 16 : జోగుళాంబ గద్వాల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వేగంగా కొనసాగుతున్నాయి. 74 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. అయితే, ప్రస్తు తం మార్కెట్కు వస్తున్న ధాన్యానికి అనుగుణంగా ఇప్పటివరకు 70 కేంద్రాలు ప్రారంభించగా.., 53 సెంటర్లలో కొనుగోళ్లు జరుగుతున్నాయి. సేకరించి న ధాన్యాన్ని అధికారులు లారీల ద్వారా మిల్లులకు తరలిస్తున్నారు. జిల్లాలో 1.90 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా, ఇప్పటివరకు 2,179 మంది రైతుల నుంచి 15,037.92 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. ఇందులో 9,962 మెట్రిక్ టన్నులను మిల్లులకు పంపించారు. 88 మంది రైతులకు డబ్బులు చెల్లించారు. మిగిలిన రైతులకు రూ.1,40,94,672 చెల్లించాల్సి ఉన్నట్లు సివిల్ సప్లయ్ జిల్లా అధికారి రేవతి తెలిపారు. రైతులకు ఇబ్బందుల్లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు. ఇప్పటివరకు జిల్లాలో 8 శాతం కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు.
6వేల మందికి చెల్లింపులు
నారాయణపేట టౌన్, డిసెంబర్ 16 : కొనుగోలు కేంద్రాలకు ధాన్యం అధికంగా వస్తున్నది. ధాన్యం సేకరించిన పది రోజుల్లోగా రైతుల ఖాతాల్లో డబ్బు లు జమ అవుతుండడంతో ఆసక్తి కనబరుస్తునారు. జిల్లా వ్యాప్తంగా ఐకేపీ ఆధ్వర్యంలో 45, ప్రాథమిక సహకార సంఘాలతో 49, మెప్మా-3, వ్యవసాయ మా ర్కెట్ కమిటీల ద్వారా 7.. మొత్తం 104 కేంద్రాలను ఏర్పాటు చేశారు. వానకా లం సీజన్లో 40,336 హెక్టార్లలో వరి సాగుచేయగా.., 2,49,281 మెట్రిక్ ట న్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారుల అంచనా. రైతులు తమ అవసరాలకుపోను దాదాపుగా లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని విక్రయించన్నుట్లు అధికారులు తెలిపారు. కాగా, ఇప్పటివరకు 10,358 మంది రైతుల నుంచి గ్రేడ్ ఏ రకం 60,785 మెట్రిక్ టన్నులు, సాధారణ రకం 18 మెట్రిక్ టన్నులు.. మొ త్తం 60,803 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. 6,083 మంది రైతుల ఖాతాల్లో రూ.70.36 కోట్లు జమచేసినట్లు అధికారులు చెప్పారు. ఇప్పటివరకు 60 శాతం ధాన్యం కొనుగోలు చేశామని, మిగతా ధాన్యాన్ని 15 రోజుల్లోగా సేకరిస్తామని పౌరసరఫరాలశాఖ జిల్లా మేనేజర్ హతీరాం తెలిపారు. డబ్బుల చెల్లింపుల్లో ఎలాంటి ఇబ్బందుల్లేవన్నారు.
రైతుల ఖాతాల్లో రూ.3.5 కోట్లు జమ
నాగర్కర్నూల్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ధా న్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. వానకాలం సీజన్లో 3.12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకుగానూ సివిల్ సప్లయ్, సింగిల్విండో, మహి ళా సంఘాల ఆధ్వర్యంలో 222 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశా రు. నెల రోజులుగా రైతులు ధాన్యాన్ని కేంద్రాలకు భారీగా తీసుకొస్తున్నారు. ఇప్పటివరకు 5,197 మంది రైతుల నుంచి 31,792 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి.. రూ.3.5 కోట్లు రైతుల ఖాతాల్లో జమచేశారు. ఇంకా 2.81 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాల్సి ఉ న్నట్లు అధికారులు తెలిపారు. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని సివిల్ సప్లయ్ జిల్లా అధికారి మోహన్బాబు పేర్కొన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 27 శాతం కొనుగోలు చేసినట్లు చెప్పారు.
లక్ష టన్నులు బయట విక్రయించారు..
ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ధాన్యం సేకరణ చేపట్టాం. ఐకేపీ 97, పీఏసీసీఎస్ 81, డీసీఎంఎస్ 4, మార్కెట్ కమిటీ 4, మెప్మా ద్వారా ఒకటి.. మొత్తం 187 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. వంద శాతం పూర్తయిన చోట ఆరు కేంద్రాలను మూ సేశాం. జిల్లాలో 3.50 లక్షల ధాన్యం దిగుబడి అవుతుందని అంచనా. ఇప్పటివరకు 1,05,228.070 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం. కేంద్రాలకు వచ్చే ధాన్యం కాకుండా లక్ష టన్నుల వరకు రైస్ మిల్లర్లు నేరుగా కొనుగోలు చేశారు. మరో 75 నుంచి 85 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు కేంద్రాలకు వస్తుందని భావిస్తున్నాం. మరో నెలపాటు కొనుగోళ్లు చేపట్టే అవకాశం ఉన్నది. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నాం.
వెంటనే మిల్లర్లకు తరలిస్తున్నాం..
కొనుగోలు కేంద్రాల నుంచి సేకరించిన ధాన్యాన్ని వెంటనే మిల్లర్లకు తరలిస్తున్నాం. ఇప్పటివరకు 1,03,322.860 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పంపించాం. 1,905.210 మెట్రిక్ టన్నులను తరలించాల్సి ఉన్నది. ఎకరానికి 25 క్వింటాళ్ల వరకు దిగుబడి అంచనా వేయగా.. 17 నుంచి 19 క్వింటాళ్ల వరకు మాత్రమే వచ్చింది. అందువల్లే దిగుబడి అంచనా తగ్గింది. రైతులు తమ అవసరాలకు ధాన్యం ఉంచుకోవడమే కాకుండా ఓపెన్ మార్కెట్లోనూ విక్రయించారు. అందువల్లే ఊహించిన మేర కొనుగోలు కేంద్రాలకు వడ్లు రాలేదు. రైతులు తెచ్చిన ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తాం.
మద్దతు ధర అందిస్తున్నారు..
నాకున్న రెండెకరాల్లో ఆర్ఎన్ఆర్ రకం ధాన్యం పండించాను. మా అవసరాలకు సరిపడా ఉంచుకొని 10 బస్తాలు కేంద్రానికి తీసుకొచ్చాను. ప్రభుత్వం మద్దతు ధర రూ.1960 ఉండడంతో నేరుగా మహబూబ్నగర్ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చాను. మంచి ధర అందిస్తున్నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
మార్కెట్లోనే అమ్ముతున్నాం..
నాకు నాలుగెకరాల పొలం ఉన్నది. ఎకరాలో ఆర్ఎన్ఆర్, మూడెకరాల్లో 1010 రకం పండించాను. ఆర్ఎన్ఆర్కు మంచి ధర ఉన్నందుకు మార్కెట్కు తీసుకొచ్చాను. ఇంకా కాంటా కాలేదు. ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తున్నందుకే మార్కెట్కు వచ్చి అమ్ముతున్నాం.