మన్సూరాబాద్ : డిగ్రీ చదువుతున్న ఓ పేద విద్యార్థి ఉన్నత చదువులకు ఉప్పల ఫౌండేషన్ చేయూతనిచ్చింది. మెదక్ జిల్లా దుబ్బాక నియోజకవర్గం చేగుంట గ్రామానికి చెందిన తీగుళ్ల ఆంజనేయులు, శోభ దంపతుల కుమారుడు సంజీవ్కుమార్ డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్నాడు.
ఆంజనేయులు, శోభ దంపతుల ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమేనని తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త వెంటనే స్పందించి సంజీవ్కుమార్ పై చదువులకు ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు.
నాగోల్, కోఆపరేటివ్ బ్యాంకు కాలనీలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంజీవ్కుమార్కు రూ. 15 వేల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో ఐవీఎఫ్ స్టేట్ జనరల్ సెక్రటరీ పబ్బ చంద్రశేఖర్ గుప్త తదితరులు పాల్గొన్నారు.