కవాడిగూడ : గాంధీజీ సిద్దాంతాలు, ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యం చేయాలని గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ సంస్థల తెలంగాణ, ఏపీ రాష్ట్రాల చైర్మన్ డాక్టర్ గున్నా రాజేందర్రెడ్డి, కార్యదర్శి డాక్టర్ యానాల ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం గాంధీ సంస్థల కార్యాలయంలో జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా వారు నివాళుల ర్పించారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ ప్రకృతి వైద్యులు డాక్టర్ కేవై రాంచందర్ రావు, డాక్టర్ ఎన్జీ పద్మ, ప్రతినిధులు ఎస్ఎన్ రెడ్డి, కేవీ కృష్ణారావు, అంకిరెడ్డి, మైనేని వాణి, వి. మంజుల, కే.సుభాష్ చంద్ర, సురేందర్, కేఎస్ రావు, బుర దశరథ్ గౌడ్, సంతోష్, జయరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కవాడిగూడలోని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కార్యాలయంలో తెలంగాణ అడ్వకేట్ జేఏసీ అధ్యక్షుడు, గ్రామ పంచాయతీ రాజ్ ట్రిబ్యూనల్ సభ్యుడు పులిగారి గోవర్ధన్ రెడ్డి గాంధీజీ విగ్రహానికి నివాళులర్పించారు.