తెలుగుయూనివర్సిటీ : కార్తీక పౌర్ణమి సందర్బంగా స్ఫూర్తి కుటుంబం ఆధ్వర్యంలో ప్రస్థాన సాధన పేరుతో ఉచిత ఆన్లైన్ ఆసన ప్రాణాయామ ధ్యాన సాధన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వహకులు ఆళ్ళ రాజేష్, పి.పవన్కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
మనసును ఉన్న స్థితినుండి ఉన్నత స్థితికి తీసుకువెళ్ళడంతో పాటు ఆధ్యాత్మికంగా ఉన్నత దశలకు తీసుకువెళ్ళే ఏకైక సాధన విధానం ధ్యాన మనో ప్రస్థానంగా వెల్లడించారు. గురు విశ్వస్ఫూర్తి అందించిన ఈ ప్రస్థాన సాధనా విధానంలో ఆసన, ప్రాణాయామ, మెడిటేషన్ తదితర ప్రాధమిక దశలను నవంబర్ 13నుండి 18వరకు ప్రతిరోజు ఉదయం 4.30గంటల నుండి 7గంటల వరకు 7రోజుల పాటు ఆన్లైన్లో కార్యక్రమం ఉంటుందన్నారు.
ఉచిత లైవ్ ప్రోగ్రాంను వీక్షించాలనే ఆసక్తి గలవారు 9866215033, 7993956759, 8639461415 నెంబర్లలో సంప్రదించి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.