సూర్యాపేట, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ) : యాసంగి సాగుకు ముందే రైతులకు ప్రభుత్వం రైతుబంధు సాయం విడుదల చేసింది. నాలుగు రోజులుగా నేరుగా ఖాతాల్లోనే నగదు జమ అవుతుండడంతో అన్నదాతల కుటుంబాల్లో పండుగ వాతావరణం కనిపిస్తున్నది. శుక్రవారం ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 1,08,097 మంది రైతుల ఖాతాల్లో 183.46 కోట్లు జమయ్యాయి. నాలుగు రోజుల్లో 7,79,763 మంది రైతుల ఖాతాల్లో 651 కోట్లు జమ చేసినట్లు అధికారులు తెలిపారు. సకాలంలో పెట్టుబడి సాయం అందుతుండడంతో రైతుల్లో సంతోషం కనిపిస్తున్నది. కృతజ్ఞతా భావంతో జిల్లా వ్యాప్తంగా సీఎం కేసీఆర్తోపాటు మంత్రి జగదీశ్రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇలా..
సూర్యాపేట జిల్లాలో శుక్రవారం నాటికి 2,18,590 మంది రైతుల ఖాతాల్లో రూ.179,07,85,977 జమయ్యాయి. నల్లగొండ జిల్లాలో 3,80,728 మంది రైతుల ఖాతాల్లో రూ.324,16,06,140 జమ చేశారు. యాదాద్రి జిల్లాలో 25,927 మంది రైతులకు రూ.43,30,09,905 జమైనట్లు అధికారులు తెలిపారు.