ఉస్మానియా యూనివర్సిటీ: జెండా పండుగలో ప్రతి ఒక్క టీఆర్ఎస్వీ కార్యకర్త, విద్యార్థి పాల్గొని విజయవంతం చేయాలని టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల సతీశ్ పిలుపునిచ్చారు. ఢిల్లీలో పార్టీ కార్యాలయ నిర్మాణానికి ఈ నెల 2న కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తున్న నేపథ్యంలో జెండా పండుగ నిర్వహించాలని పార్టీ అధినాయకత్వం నిర్ణయించిందని చెప్పారు.
అరవై ఏండ్ల ప్రస్థానంలో తెలంగాణ రాష్ట్రాన్ని, ప్రజలను ఎన్నో అవమానాలకు గురిచేశారని, ఆ బానిస సంకెళ్ల నుంచి మనలను విముక్తి చేసిన మహానీయుడు కేసీఆర్ అని కొనియాడారు. ఢిల్లీలో నిర్మించబోయే తెలంగాణ భవన్ మన రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. శంకుస్థాపన రోజును గుర్తుండిపోయే రోజుగా చరిత్రలో నిలపాలని కోరారు.