ఉస్మానియా యూనివర్సిటీ : తార్నాక డివిజన్లోని ఎర్రకుంట దోబీఘాట్ అభివృద్ధికి కృషి చేస్తానని డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్రెడ్డి అన్నారు. రజకులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పాటుపడతానని చెప్పారు.
ఎర్రకుంట చెరువు ప్రాంతంలో తార్నాక రజక సేవా సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ఈదమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్రెడ్డితో కలిసి డిప్యూటీ మేయర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం వారు మాట్లాడుతూ దోబీ ఘాట్లో స్ట్రీట్ లైట్లు కూడా లేవని రజకులు వారి దృష్టికి తీసుకురాగా అవి నెలకొల్పడంతో పాటు దోబీ ఘాట్ను ఆధునికంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని చెప్పారు.
ఈ కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ నాయకులు వంజరి వెంకటేశ్, అనిల్ సర్వదే, కృష్ణ, రమేశ్, మైసయ్య, హన్మంతు, పి. రాజు, శ్రీనివాస్, మల్లికార్జున్, సోమయ్య, సాలయ్య, తిరుపతి, భూమయ్య, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.