ఉస్మానియా యూనివర్సిటీ : తెలంగాణ రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్(సీపీజీఈటీ) – 2021 ప్రవేశాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సోమవారం నుంచి ప్రారంభించనున్నట్లు సీపీజీఈటీ కన్వీనర్ ప్రొఫెసర్ ఐ. పాండురంగారెడ్డి తెలిపారు.
పూర్తి షెడ్యూల్ను త్వరలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అభ్యర్థులు తమ సర్టిఫికెట్లను అప్లోడ్ చేసే ముందు అన్ని నిబంధనలను వివరంగా చదవాలని సూచించారు. నిబంధనలు పూర్తిగా చదివిన తరువాతే వెబ్ఆప్షన్లను ఎంచుకోవాలన్నారు.
అర్హతలు చూసుకోకుండా ఆప్షన్లను ఎంచుకుంటే తరువాత ఇబ్బందులకు గురయ్యే ప్రమాదముందని హెచ్చరించారు. అడ్మిషన్ ప్రక్రియకు సంబంధించిన తాజా సమాచారం కోసం తమ వెబ్సైట్ను క్రమం తప్పకుండా చూడాలని సూచించారు.