గోల్నాక : బస్తీలు, కాలనీల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకునేందుకు అందరూ ముందుకు రావాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. గోల్నాక డివిజన్లోని జైస్వాల్గార్డెన్ మైసమ్మ దేవాలయంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను ఆయన ప్రారంభించారు.
ఈ కెమెరాలను ఆలయ కమిటి చైర్మన్ జీ.ప్రసన్నాంజనేయులు ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లా డుతూ సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు వచ్చిన ప్రసన్నాంజనేయులును అలాగే మురళీమోహన్లను అభినం దించి శాలువాలతో సత్కరించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని చెప్పారు.
పోలీసు శాఖకు కావాల్సిన మౌళిక సదుపాయాలకు కృషి చేస్తున్నామన్నారు. నియోజకవర్గంలోని అన్ని బస్తీలు, కాలనీల్లో కూడా సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో జైస్వాల్గార్డెన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సి.శ్రీనివాస్ ముదిరాజ్, చైర్మన్ రామాగౌడ్, ఆలయ కమిటి అధ్యక్షుడు రమేష్గౌడ్, కాలనీ, ఆలయ కమిటి ప్రతినిధులు యాదవరెడ్డి, వెంకటేశ్గౌడ్, మధుసూధనచారి, దిలీప్గౌడ్, కవిత, శ్రీహరిచారి, జైస్వాల్రెడ్డి, అనిల్చారి, రాములుయాదవ్, సత్యనారాయణ, సంతోష్గుప్త, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.