చంపాపేట, ఎల్బీనగర్ : తెలంగాణ రాష్త్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆయన నివాసంలో పలువురు నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చంపాపేట డివిజన్ మాజీ కార్పొరేటర్ సామ రమణారెడ్డి టీఆర్ఎస్ శ్రేణులతో కలసి మంత్రి నిరంజన్రెడ్డి నివాసా నికి వెళ్లి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
అక్కడే ఉన్న దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే ఆలే వెంకటేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డిలతో సంయు క్తంగా మంత్రిని గజ మాలతో సత్కరించి, పూల మొక్కను అందజేశారు. ఈ కార్యక్రమంలో చంపాపేట డివిజన్ టీఆర్ఎస్ నాయకులు కృష్ణయాదవ్, జయసింహారెడ్డి, నరేశ్, ఆఫ్రిది, మాజీ ఏరియా కమిటి సభ్యులు అబ్ధుల్ ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.
టీఎన్జీఓస్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉద్యోగుల సెంట్రల్ ఫోరం అధ్యక్షుడు చిలుక నర్సింహారెడ్డి, కార్యదర్శి ముకురం ఆధ్వర్యంలో మినిస్టర్ క్వార్టర్స్లో కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శాలువా కప్పి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇ.వెంకటేశం, ఎ.చంద్రశేఖర్, నరేందర్, వెంకట్రెడ్డి, సంతోష్, ఖాళీద్ అహ్మద్, మురళి, ఎల్.శ్రీనివాస్, హబీబ అల్వి, మధుబాబు తదితరులు పాల్గొన్నారు.