బంజారాహిల్స్ : శ్రీనగర్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ ఆవరణలో కొలువైన శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్పస్వామి మండల పూజా మహోత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్బంగా ఉదయం శ్రీ మహా గణపతి హోమం, పంచామృత అభిషేకం, అర్చన, మహాహారతి తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
మండల పూజా మహోత్సవాల్లో భాగంగా అయ్యప్ప దీక్షాధారులకు శ్రీ మణికంఠ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు. 45రోజుల పాటు అయ్యప్ప స్వాములకు అన్నదానం నిర్వహిస్తున్నట్లు సమితి అధ్యక్షుడు సి.మురళీధర్, ఉపాధ్యక్షులు సునంద్ తెలిపారు.
అన్నదానం కోసం వినియోగించే బియ్యాన్ని సువర్ణభూమి సంస్థ అధిపతి శ్రీధర్ సమకూరుస్తున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సువర్ణభూమి అధినేత శ్రీధర్, అయ్యప్ప స్వామి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసశర్మ తదితరులు పాల్గొన్నారు.