హిమాయత్నగర్ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఫోటోను కరెన్సీ నోటుపై ముద్రించాలని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండా ప్రకాశ్ ముదిరాజ్ కేంద్ర ప్రభుతాన్ని కోరారు. ఈ అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావించి చర్చించేందు కు చొరవ తీసుకుంటానని తెలిపారు.
అంబేద్కర్ ఫోటో సాధన సమితి ఆధ్వర్యంలో ఈ నెల 26న యాదాద్రి భువనగిరిజిల్లా నుంచి ప్రారంభమై 2022 ఏప్రిల్ 14వరకు కొనసాగే జ్ఞానయుద్ధ యాత్ర కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ ఆవిష్కరణ ఆదివారం హైదర్గూడలోని ఎంపీ క్యాంప్ కార్యాలయంలో జరిగింది.
ఈ సందర్భంగా బండా ప్రకాశ్ ముదిరాజ్ మాట్లాడుతూ అంబేద్కర్ కృషితోనే 1935 ఏప్రిల్ 1న రిజర్వ్ బ్యాంక్ను స్థాపిం చారన్నారు. అలాంటి మహానీయున్ని గౌరవించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలోని అట్టడగు వర్గాల ప్రజల కు సంక్షేమ ఫలాలు అందాలనే లక్ష్యంతో వారి అభ్యున్నతికి అంబేద్కర్ కృషి చేశారన్నారు.
అలాంటి మహానీయుని ఫోటోను కరెన్సీ నోటుపై ముద్రిం చేందుకు కేంద్రం కృషి చేయాలన్నారు. ఈ అంశంపై రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని కలిసి వినతి పత్రం అందజేస్తామని వివరించారు.ఈ సమావేశంలో అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు జేరిపోతుల పరశురాం, బొల్లిస్వామి, జాతీయ అధికార ప్రతినిధి మబ్బు పరశురాం, నాయకులు రవి, జి.కృష్ణ తదితరులు పాల్గొన్నారు.