మన్సూరాబాద్ : ఎల్బీనగర్ రింగ్రోడ్డులో జరుగుతున్న అండర్పాస్ రోడ్డు నిర్మాణ పనులు వేగవంతంగా జరుగు తున్నాయని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు.
ఎల్బీనగర్ రింగ్రోడ్డు, చింతలకుంట నుంచి దిల్సుఖ్నగర్, సాగర్ రింగ్రోడ్డు తదితర ప్రాంతాల్లో జరుగుతున్న ఫ్లెఓవర్లు, అండర్పాస్ రోడ్ల నిర్మాణ పనులను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి పనులను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రింగ్రోడ్డులోని అండర్పాస్ నిర్మాణపనులను ఈనెల చివరి వారం లోపు పూర్తి చేసి మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేతులమీదుగా ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు.
ఎల్బీనగర్ నియోజకవర్గంలో సుమారు రూ. 458 కోట్లతో జరుగుతున్న అండర్పాస్, ఫ్లెఓవర్ నిర్మాణ పనుల వల్ల ఏండ్ల తరబడిగా ఉన్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని ప్రధాన కూడళ్లు ట్రాఫిక్ ఫ్రీ జంక్షన్లుగా మారనున్నాయని ఆయన తెలిపారు.